Local Passenger Trains: ఫిబ్రవరి 1 నుంచి సాధారణ రైళ్లు.? వైరల్ అవుతున్న ట్వీట్.. కేంద్రం వివరణ ఇదే.!
2021 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అన్ని ప్యాసింజర్, రెగ్యులర్, లోకల్ రైళ్లను రైల్వేశాఖ పట్టాలెక్కించనున్నట్లు ఓ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది...
Local Passenger Trains: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మార్చి నెలలోనే కేంద్రం దేశమంతా లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో అప్పటి నుంచి రైల్వే శాఖ దేశవ్యాప్తంగా రైళ్ల రాకపోకలను నిలిపివేసింది. ఆ తర్వాత ప్రయాణీకుల సౌకర్యార్ధం మే నెల నుంచి దశల వారీగా స్పెషల్ ట్రైన్స్ను పట్టాలెక్కిస్తూ వస్తోంది. ఇదిలా ఉంటే 2021 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అన్ని ప్యాసింజర్, రెగ్యులర్, లోకల్ రైళ్లను రైల్వేశాఖ పట్టాలెక్కించనున్నట్లు ఓ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ట్విట్టర్ వేదికగా స్పందించింది.
ఫిబ్రవరి నుంచి సాధారణ రైళ్లు ప్రారంభమవుతాయని వస్తున్న వార్తలో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేసింది. ఆ ట్వీట్ను ఎవరో మార్ఫింగ్ చేశారని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెల్లడించింది. ఇండియన్ రైల్వేస్ అలాంటి ప్రకటన ఏం చేయలేదని రైల్వే అధికారులు తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలతో చర్చించిన అనంతరం సాధారణ రైళ్ల పున: ప్రారంభంపై తుది నిర్ణయం తీసుకుంటామని రైల్వేశాఖ అధికారులు తెలిపారు.
दावा: एक #Morphed तस्वीर में दावा किया जा रहा है कि रेलवे बोर्ड ने 1 फरवरी 2021 से सभी पैसेंजर ट्रेन, लोकल ट्रेन और यात्री स्पेशल ट्रेन चालू करने का ऐलान किया है। #PIBFactCheck: यह दावा फ़र्ज़ी है। @RailMinIndia ने ऐसी कोई घोषणा नहीं की है। pic.twitter.com/TlZNaILj9w
— PIB Fact Check (@PIBFactCheck) January 22, 2021