రైతులకు రూ.లక్ష వడ్డీలేని రుణాలు? కేంద్ర బడ్జెట్ పై అన్నదాత ఆశలు
రాబోయే బడ్జెట్ లో వ్యవసాయరంగానికి పెద్దపీట వేసేందుకు కేంద్రం అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆరుగాలం శ్రమించి పంటలు పండించే రైతుకు భరోసా కల్పించే దిశగా మోదీ సర్కార్ అడుగులు వేస్తోంది. అన్నదాతను ఆదుకునేందుకు ఈసారి బడ్జెట్ లో ఎక్కువ నిధులు కేటాయించేలా ప్రణాళికలు రూపొందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలోనే రెండో మహిళా ఆర్ధికమంత్రిగా పదవిని చేపట్టిన నిర్మలా సీతారామన్ ఈసారి వ్యవసాయరంగానికి భారీగా నిధులు కేటాయించే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే జూలై 5న ప్రవేశపెట్టనున్న 2019-2020 […]
రాబోయే బడ్జెట్ లో వ్యవసాయరంగానికి పెద్దపీట వేసేందుకు కేంద్రం అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆరుగాలం శ్రమించి పంటలు పండించే రైతుకు భరోసా కల్పించే దిశగా మోదీ సర్కార్ అడుగులు వేస్తోంది. అన్నదాతను ఆదుకునేందుకు ఈసారి బడ్జెట్ లో ఎక్కువ నిధులు కేటాయించేలా ప్రణాళికలు రూపొందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలోనే రెండో మహిళా ఆర్ధికమంత్రిగా పదవిని చేపట్టిన నిర్మలా సీతారామన్ ఈసారి వ్యవసాయరంగానికి భారీగా నిధులు కేటాయించే ఛాన్స్ ఉంది.
ఇదిలా ఉంటే జూలై 5న ప్రవేశపెట్టనున్న 2019-2020 కేంద్ర బడ్జెట్ లో రైతులకు వడ్డీలేని రుణాలు ప్రకటించే అవకాశాలున్నాయి. ఇందులో రైతులకు రూ.లక్ష వరకు స్వల్పకాలిక రుణాలు కూడా ప్రకటించే అవకాశమున్నట్టుగా తెలుస్తోంది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు వడ్డీ లేని రుణాలు ఇస్తామంటూ బీజేపీ ఎన్నికల హామీ కూడా ఇచ్చింది. దీన్నిబట్టి ఈసారి బడ్జెట్ లో ఖచ్చితంగా వ్యవసాయ రంగాన్ని ఆదుకోడానికి, ముఖ్యంగా రైతులకు రూ.లక్ష రూపాయల వడ్డీ లేని రుణాలకు ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.