జోరందుకున్న మద్యం గిరాకీలు.. ఒక్కరోజే రూ.185 కోట్ల అమ్మకాలు..
ఏ క్షణమైనా లాక్డౌన్ ప్రకటించొచ్చని భావించిన మద్యం ప్రియులు పెద్ద మొత్తంలో ముందుగానే మద్యం కొనుగోలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 2,216 మద్యం దుకాణాల ద్వారా.. 29 రోజులకు ఏకంగా రూ.2,226 కోట్లు విలువైన 26.29 లక్షల కేసుల లిక్కర్..
తెలంగాణలో కరోనా వైరస్ విపరీతంగా విస్తరిస్తోన్న విషయం తెలిసిందే. రోజురోజుకీ కేసుల సంఖ్య ఉధృతంగా పెరిగిపోతుంది. ఇక గ్రేటర్ హైదరాబాద్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులకు, వైద్యులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో తెలంగాణలో మరోసారి లాక్డౌన్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఎలా లేదన్నా.. ఓ రెండు వారాల పాటు సంపూర్ణ లాక్డౌన్ విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
దీంతో ఏ క్షణమైనా లాక్డౌన్ ప్రకటించొచ్చని భావించిన మద్యం ప్రియులు పెద్ద మొత్తంలో ముందుగానే మద్యం కొనుగోలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 2,216 మద్యం దుకాణాల ద్వారా.. 29 రోజులకు ఏకంగా రూ.2,226 కోట్లు విలువైన 26.29 లక్షల కేసుల లిక్కర్, 27.30 లక్షల కేసుల బీరు అమ్ముడు పోయింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు సగటున 70 నుంచి 80 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోతుండగా.. సోమవారం ఒక్కరోజే మాత్రం ఏకంగా రూ.185 కోట్లు విలువైన మద్యం అమ్ముడుపోయింది.
ఇక మిగిలిన జిల్లాల్లో జరిగిన విక్రయాలు పరిశీలిస్తే.. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా రూ.42 కోట్లు, హైదరాబాద్లో రూ.21 కోట్లు, నల్గొండలో రూ.18.45 కోట్లు, కరీంగనగర్లో రూ.16 కోట్లు, వరంగల్లో రూ.15.44 కోట్లు, ఖమ్మం, మహబూబ్ నగర్లలో రూ. 12 కోట్లకు పైగానే అమ్మకాలు జరిగాయి.