పిడుగుల దాటికి 21 మంది బలి
బిహార్లో పిడుగుల వర్షం మరోసారి అక్కడి ప్రజల ప్రాణాల్ని బలిగొంది. గడిచిన 24 గంటల్లో పలు జిల్లాల్లో పిడుగుల వర్షం కారణంగా.. ఏకంగా 21 మంది మరణించారు. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో..
బిహార్లో పిడుగుల వర్షం మరోసారి అక్కడి ప్రజల ప్రాణాల్ని బలిగొంది. గడిచిన 24 గంటల్లో పలు జిల్లాల్లో పిడుగుల వర్షం కారణంగా.. ఏకంగా 21 మంది మరణించారు. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో 21 మంది పిడుగుల దాటికి మృతిచెందినట్లు బిహార్ విపత్తు నిర్వహణ విభాగం అధికారులు ప్రకటించారు. లఖిసరయి, గయ, బంకా, జాముయ్, సమస్తీపూర్, వైశాలీ, నలంద, బోజ్పూర్ జిల్లాల్లో పిడుగులు పట్టాయని అధికారులు తెలిపారు. పిడుగుల దాటికి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సీఎం నితీష్ కుమార్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబాలకు రూ.4 లక్షల నష్టపరిహారాన్ని అందించారు. శుక్రవారం నాడు పిడుగులు పడి ఎనిమిది మంది మరణించారని.. సమస్తీపూర్ జిల్లాలో ముగ్గురు, లఖిసరయిలో ఇద్దరు, గయ, బంకా, జామూయ్ ప్రాంతాల్లో ఒక్కొక్కరు మరణించినట్లు తెలిపారు. గత వారం రోజుల్లో ఉరుములు,మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయని.. ఈ క్రమంలో పిడుగులు పడి.. ఇప్పటి వరకు రాష్ట్రంలో 90 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని అధికారుల తెలిపారు.
21 people lost their lives due to lightning strikes in Lakhisarai, Gaya, Banka, Jamui, Samastipur, Vaishali, Nalanda, and Bhojpur districts in the last 24 hours: Bihar Disaster Management Department
— ANI (@ANI) July 4, 2020