రోజూ 20 నిమిషాల నడకతో ఒత్తిడికి చెక్..
ఈ ఉరుకుల పరుగుల నగరంలో ఆరోగ్యం గురించి శ్రద్ద తీసుకునేవారు చాలా తక్కువ. తినడానికి కూడా సమయం దొరకనంతగా ఉద్యోగాల్లో నిమగ్నమై ఉంటున్నారు. దీంతో.. ఒకసారి కాకపోయినా.. ఒకసారన్నా.. శరీరం అలసటకు గురవుతూ ఉంటుంది. కాబట్టి.. నడకతో ఒత్తిడికి చెక్ పెట్టొచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు. రోజూ కనీసం 20 నిమిషాల నడక నడిస్తే శారీరానికి చాలా మంచిదని పేర్కొన్నారు. నడకతో అన్ని రకాల రోగాలు దూరం అవుతున్నాయి. రక్తపోటు, మధుమేహం, మానసిక ఒత్తిడి, క్యాన్సర్, గుండె సంబంధిత […]
ఈ ఉరుకుల పరుగుల నగరంలో ఆరోగ్యం గురించి శ్రద్ద తీసుకునేవారు చాలా తక్కువ. తినడానికి కూడా సమయం దొరకనంతగా ఉద్యోగాల్లో నిమగ్నమై ఉంటున్నారు. దీంతో.. ఒకసారి కాకపోయినా.. ఒకసారన్నా.. శరీరం అలసటకు గురవుతూ ఉంటుంది. కాబట్టి.. నడకతో ఒత్తిడికి చెక్ పెట్టొచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు. రోజూ కనీసం 20 నిమిషాల నడక నడిస్తే శారీరానికి చాలా మంచిదని పేర్కొన్నారు.
నడకతో అన్ని రకాల రోగాలు దూరం అవుతున్నాయి. రక్తపోటు, మధుమేహం, మానసిక ఒత్తిడి, క్యాన్సర్, గుండె సంబంధిత జబ్బులు దరిచేరవు. ప్రశాంతమైన వాతావరణంలో వాకింగ్ చేయడం వల్ల శరీరానికి అవసరమైన ఆక్సిజన్ లభిస్తుంది. ఉదయాన్నే సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు మనిషిపై పడటం వల్ల మిటమిన్ డీ పుష్కలంగా దొరుకుతుంది. శరీరభాగంలో ఉన్న అధిక కొవ్వును కరిగించి, బరువు తగ్గించేందుకు నడక దోహదపడుతోంది. క్రమం తప్పకుండా వ్యాయమం చేయడం వలన మనసు ప్రశాతంగా ఉంటుంది. నిరంతరం వాకింగ్ చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరగటమే కాకుండా , జ్ఞాపక శక్తి మెరుగుపడుతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.
అలాగే.. వాకింగ్ చేయడం వల్ల రోగాలన్నీ దూరమవుతాయని.. చిన్నప్పటి నుంచీ వాకింగ్ అలావాటుగా మార్చుకోవడం మంచిదని సూచించారు. ప్రతి రోజు ఉదయం వాకింగ్ చేయడం వల్ల రోజంతా ఉల్లాసంగా ఉంటారని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఉద్యోగ వృత్తిలో మానసిక ఓత్తిడికి గురికాకుండా వాకింగ్ నియంత్రిస్తుందని చెప్తున్నారు.