ఎల్ఐసీలో అద్బుత స్కీమ్..ప్రతి నెలా రూ.9,000 పింఛన్..
దిగ్గజ బీమా కంపెనీ ఎల్ఐసీ ప్రజలకు ఎన్నో రకాల పాలసీలు అందిస్తోంది. యాన్యుటీ ప్లాన్, మనీ బ్యాక్ ప్లాన్, టర్మ్ ప్లాన్, ఎండోమెంట్ ప్లాన్, చిల్డ్రన్స్ ప్లాన్ ఇలా ఎన్నో రకాల పాలసీలు అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిల్లో చేరడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్న సంగతి తెలిసిందే.
దిగ్గజ బీమా కంపెనీ ఎల్ఐసీ ప్రజలకు ఎన్నో రకాల పాలసీలు అందిస్తోంది. యాన్యుటీ ప్లాన్, మనీ బ్యాక్ ప్లాన్, టర్మ్ ప్లాన్, ఎండోమెంట్ ప్లాన్, చిల్డ్రన్స్ ప్లాన్ ఇలా ఎన్నో రకాల పాలసీలు అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిల్లో చేరడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఎల్ఐసీ తాజాగా.. వయ వందన యోజన స్కీమ్ను ప్రవేశపెట్టింది.సెంట్రల్ గవర్నమెంట్ తరుపున ఎల్ఐసీ ఈ వయ వందన స్కీమ్ అందిస్తోంది. ఇందులో చేరినవారు 60 ఏళ్లు దాటిన వారు ప్రతి నెలా పెన్షన్ తీసుకోవచ్చు. మీరు ఇన్వెస్ట్ చేసే డబ్బును బట్టి.. మీరు పొందే పింఛన్ మారుతుంది. కాగా ఈ స్కీమ్ 2023 మార్చి వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
అయితే ఈ పథకం కేవలం సీనియర్ సిటిజన్స్ కోసం మాత్రమే. స్కీమ్ మెచ్యూరిటీ కాలం టెన్ ఇయర్స్. అంటే పదేళ్ల వరకు పథకం బెనిఫిట్స్ పొందొచ్చు. వయ వందనయోజన స్కీమ్ ద్వారా 7.4 శాతం ఇంట్రస్ట్ లభిస్తుంది. ఇప్పటి దాకా 6.28 లక్షల మంది ఈ స్కీమ్ లో చేరారు. పథకంలో చేరడం ద్వారా నెలకు రూ.1,000 నుంచి రూ.9,250 వరకు పింఛన్ పొందొచ్చు. కావాలంటే..నెలకు లేదంటే మూడు నెలలకు, ఆరు నెలలకు, ఏడాదికి కూడా పెన్షన్ తీసుకోవచ్చు. రూ.15 లక్షలు పెట్టుబడి పెడితే రూ.9,250 పింఛన్ వస్తుంది. కనీసం రూ.1.5 లక్షలు పెట్టాలి. ఇలా చేస్తే రూ.1,000 పింఛన్ పొందొచ్చు. అంతేకాకుండా ఈ స్కీమ్ లో చేరడం వల్ల లోన్ ఫెసిలిటీ కూడా లభిస్తుంది.