భారత్ ఉద్దేశపూర్వకంగా ఓడిపోలేదు- సర్ఫరాజ్
వరల్డ్ కప్ లీగ్ దశలో ఇంగ్లాండ్తో జరిగిన ఒకే ఒక మ్యాచ్లో మాత్రమే టీమిండియా ఓడిన సంగతి తెలిసిందే. అయితే మన ఓటమి ప్రభావం పాకిస్థాన్పై పడింది. వారి సెమీస్ అవకాశాలు మన ఓటమితో పూర్తిగా గల్లంతయ్యాయి. అయితే ఆ మ్యాచ్లో టీమిండియా ఓటమిపై పాక్ మాజీ క్రికెటర్లు పరోక్షంగా కాస్త ఘాటు విమర్శలు గుప్పించారు. టీమిండియా కావాలని ఓడిపోయింది అన్నవారు కూడా లేకపోలేదు. కోహ్లీసేన క్రీడాస్ఫూర్తి ప్రదర్శించలేదంటూ ఆ జట్టు మాజీ క్రికెటర్ వకార్ యూనిస్ […]
వరల్డ్ కప్ లీగ్ దశలో ఇంగ్లాండ్తో జరిగిన ఒకే ఒక మ్యాచ్లో మాత్రమే టీమిండియా ఓడిన సంగతి తెలిసిందే. అయితే మన ఓటమి ప్రభావం పాకిస్థాన్పై పడింది. వారి సెమీస్ అవకాశాలు మన ఓటమితో పూర్తిగా గల్లంతయ్యాయి. అయితే ఆ మ్యాచ్లో టీమిండియా ఓటమిపై పాక్ మాజీ క్రికెటర్లు పరోక్షంగా కాస్త ఘాటు విమర్శలు గుప్పించారు. టీమిండియా కావాలని ఓడిపోయింది అన్నవారు కూడా లేకపోలేదు. కోహ్లీసేన క్రీడాస్ఫూర్తి ప్రదర్శించలేదంటూ ఆ జట్టు మాజీ క్రికెటర్ వకార్ యూనిస్ విమర్శించాడు. అయితే ఈ విషయంపై తాజాగా పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ స్పందించాడు.
‘టీమిండియా కావాలని ఓడిపోయిందనటం సరైన వ్యాఖ్య కాదు. ఆ మ్యాచ్లో ఇంగ్లాండ్ మంచి ప్రదర్శన చేయడం వల్లే కోహ్లీసేనకు ఓటమి తప్పలేదు. అంతేకానీ అందులో వేరే ఉద్దేశమేమీ లేదు. ’ అని సర్ఫరాజ్ పేర్కొన్నాడు.