గణతంత్ర దినోత్సవ పరేడ్‌కి సిద్ధమైన ఏపీ ప్రభుత్వ లేపాక్షి శకటం.. తెలుగుతనం ఉట్టిపడేలా రూపురేఖలు

ఏకశిలపై నిర్మించిన లేపాక్షి ఆలయం, నంది విగ్రహాలను ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం ముస్తాబైంది.

గణతంత్ర దినోత్సవ పరేడ్‌కి సిద్ధమైన ఏపీ ప్రభుత్వ లేపాక్షి శకటం.. తెలుగుతనం ఉట్టిపడేలా రూపురేఖలు
Follow us

|

Updated on: Jan 22, 2021 | 10:41 PM

Lepakshi Tableaux Ready : గణతంత్ర దినోత్సవ వేడకల్లో ప్రదర్శన కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న శకటం సిద్ధమైంది. ఏకశిలపై నిర్మించిన లేపాక్షి ఆలయం, నంది విగ్రహాలను ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం ప్రతిపాదన, నమూనాలు పంపగా కేంద్ర రక్షణశాఖ ఆమోదించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శకటం నిర్మాణం పూర్తి చేసిన కళాకారులు తుదిమెరుగులు దిద్దుతున్నారు. అత్యద్భుత నిర్మాణంగా పేరున్న లేపాక్షి ఆలయాన్ని 1583లో కూర్మశైలంగా పేరుగాంచిన ఓ చిన్న రాతికొండను తొలచి నిర్మించారు.

లేపాక్షి ఆలయాన్నే మళ్లీ నిర్మించారా అన్న రీతిలో శకటాన్ని సైతం కళాకారులు అద్భుతంగా తీర్చిదిద్దారు. దేశంలోనే అతిపెద్ద ఏకశిల నంది విగ్రహం ముందు భాగంలో, ఆ వెనుక ఆలయం ఉండేలా శకటం రూపుదిద్దుకుంది. ఈ ఆలయంలో భాగంగా ముఖ మండపం, అర్థ మండపం, అంతరాలయం, గర్భగృహం ఉన్నాయి. అలాగే కళ్యాణ మండపం కూడా ఆలయంలో భాగంగా ఉంటుంది.

Read Also… Budget 2021: కొత్త బడ్జెట్‌పై కోటి ఆశలు.. వ్యవసాయం, ఆటో రంగంలో సాంకేతికతకు ప్రాధాన్యత..