అడవుల్లో ఉండే వన్యప్రాణులు అడపదడపా నగరాల్లోకి వచ్చి తరచూ హల్చల్ చేస్తున్నాయి. అవి వనాలను విడిచిపెట్టి జన జీవనంలోకి ఎందుకు వస్తున్నాయో కారణం తెలియదు. మరోవైపు అటవీ అధికారులు భద్రతా ప్రామాణాలు సరిగా పాటించకపోవడం కూడా ఓ కారణమే అవుతోంది.
అడవుల్లో ఉండే వన్యప్రాణులు అడపదడపా నగరాల్లోకి వచ్చి తరచూ హల్చల్ చేస్తున్నాయి. అవి వనాలను విడిచిపెట్టి జన జీవనంలోకి ఎందుకు వస్తున్నాయో కారణం తెలియదు. మరోవైపు అటవీ అధికారులు భద్రతా ప్రామాణాలు సరిగా పాటించకపోవడం కూడా ఓ కారణమే అవుతోంది. రెండు రోజుల క్రితం హైదరాబాద్లోని రాజేంద్రనగర్ ప్రాంతంలో పెద్దపులిని చూసినట్లు ఆ ప్రాంత ప్రజలు చెప్పారు. మరోవైపు ఆదిలాబాద్లో ఇటీవల ఓ యువకుడిపై దాడి ప్రాణాలు పొట్టన బెట్టుకుంది.
తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్లో ఓ చిరుతపులి రోడ్లపై సంచరిస్తూ అందరిని భయభ్రాంతులకు గురి చేస్తోంది. చిరుత వీధుల్లో తిరిగినట్లు స్పష్టంగా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. అది చాలా పెద్దగా ఉందని దాడి చేస్తే మాత్రం తప్పించుకోవడం చాలా కష్టమని పలువురు చెబుతున్నారు. చిరుత సంచరించిన ఆ 12 సెకన్ల దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తిరుగుతున్నారు. ఘజియాబాద్లోని రాజ్ నగర్ ఏరియాలో తిరిగినట్లు అటవీ అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఘజియాబాద్ డెవలప్మెంట్ అథార్టీ భవన జనరేటర్ రూం దగ్గరకు చిరుత వెళ్లగా జనరేటర్ ఆన్ చెయ్యగానే అక్కడి నుంచి పారిపోయింది. ఆ తర్వాత అది ఓ చెట్టు ఎక్కి అక్కడి నుంచి దిక్కులు చూసింది. కొందరు కర్రలతో హడావుడి చేయగానే దగ్గర్లో ఉన్న ఓ ఇన్స్టిట్యూట్ క్యాంపస్ వైపు వెళ్లింది. ఆ తర్వాత చిరుత ఎటు వెళ్లిందో, ఎక్కడ దాక్కుందో కానరాలేదు.