మరో ఆరు నెలల పాటు.. గవర్నర్ పాలనే…
జమ్ముకశ్మీర్లో మరో ఆరు నెలల పాటు గవర్నర్ పాలన కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి ఇవాళ లోక్సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బిల్లును ప్రవేశపెట్టారు. జూలై 2వ తేదీతో అక్కడ గవర్నర్ పాలన ముగుస్తుంది. ఈ నేపథ్యంలో మళ్లీ గవర్నర్ పాలనను పొడిగించాలని అమిత్ షా బిల్లులో కోరారు. ఈ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. రంజాన్, అమర్నాథ్ యాత్ర వల్ల అసెంబ్లీ ఎన్నికల నిర్వహిణ ఆలస్యమైనట్లు చెప్పారు. అమర్నాథ్ యాత్ర […]
జమ్ముకశ్మీర్లో మరో ఆరు నెలల పాటు గవర్నర్ పాలన కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి ఇవాళ లోక్సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బిల్లును ప్రవేశపెట్టారు. జూలై 2వ తేదీతో అక్కడ గవర్నర్ పాలన ముగుస్తుంది. ఈ నేపథ్యంలో మళ్లీ గవర్నర్ పాలనను పొడిగించాలని అమిత్ షా బిల్లులో కోరారు. ఈ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. రంజాన్, అమర్నాథ్ యాత్ర వల్ల అసెంబ్లీ ఎన్నికల నిర్వహిణ ఆలస్యమైనట్లు చెప్పారు. అమర్నాథ్ యాత్ర ముగిసిన తరువాత.. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు షా తెలిపారు.
जम्मू-कश्मीर में मौजूदा राष्ट्रपति शासन की अवधि 2 जुलाई को पूरी होने वाली है। रमजान और अमरनाथ यात्रा के देखते हुए राज्य में चुनाव इस वर्ष के अंत तक कराने की तैयारी चल रही हैः अमित शाह, गृह मंत्री pic.twitter.com/5fRrH4zw7I
— Lok Sabha TV (@loksabhatv) June 28, 2019