‘ఇకనైనా నోళ్లు మూసుకోవాలి’
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మళ్లీ టీడీపీ అధినేత చంద్రబాబు టార్గెట్ గా సెటైర్లు వేశారు. విజయవాడలో రమేష్ హాస్పిటల్ ఆధ్వర్యంలోని కొవిడ్ సెంటర్ అయిన స్వర్ణప్యాలెస్ దగ్ధం ఘటనలో..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మళ్లీ టీడీపీ అధినేత చంద్రబాబు టార్గెట్ గా సెటైర్లు వేశారు. విజయవాడలో రమేష్ హాస్పిటల్ ఆధ్వర్యంలోని కొవిడ్ సెంటర్ అయిన స్వర్ణప్యాలెస్ దగ్ధం ఘటనలో డాక్టర్ రమేష్ పై ఈగ వాలకుండా చంద్రబాబు కాపాడారని విమర్శించారు. ‘అందర్వేది ఆలయ రథం దగ్ధంపై గంటల వ్యవధిలోనే నిజనిర్ధారణ కమిటీ వేశారు చంద్రబాబు గారు. స్వర్ణ ప్యాలేస్ అగ్నిప్రమాదంలో పది మంది అమాయకులు ప్రాణాలు కోల్పేతే కనీసం నోరు కూడా మెదపలేదెందుకని ప్రజలు అడుగుతున్నారు. రమేశ్ హాస్పిటల్స్ పై ఈగ కూడా వాలకుండా పచ్చ కండువా కప్పి కాపాడాడు.’ అంటూ విమర్శలందుకున్నారు. ఇక, సిఎం వైయస్ జగన్ గారు తాజాగా ప్రవేశపెట్టిన ‘వైయస్ఆర్ సంపూర్ణ పోషణ’ ని నీతి ఆయోగ్ ప్రశంసించిందని.. ఇది తల్లీపిల్లలు మంచి ఆరోగ్యం, పోషణను నిర్ధారిస్తుందని చెప్పారు. ఇకనైనా విమర్శకులు నోళ్లు మూసుకోవాలంటూ చురకలంటించారు విజయసాయి.
అందర్వేది ఆలయ రథం దగ్ధంపై గంటల వ్యవధిలోనే నిజనిర్ధారణ కమిటీ వేశారు చంద్రబాబు గారు. స్వర్ణ ప్యాలేస్ అగ్నిప్రమాదంలో పది మంది అమాయకులు ప్రాణాలు కోల్పేతే కనీసం నోరు కూడా మెదపలేదెందుకని ప్రజలు అడుగుతున్నారు. రమేశ్ హాస్పిటల్స్ పై ఈగ కూడా వాలకుండా పచ్చ కండువా కప్పి కాపాడాడు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 8, 2020
NITI Aayog lauds the new PRO-PEOPLE INITIATIVE of our Hon. CM YS Jagan garu, “YSR Sampoorna Poshana” which ensures good health and nutrition of both children and mothers. It describes the initiative as a great step. The critics should shut their mouths, atleast now.
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 8, 2020