అమరావతి జేఏసీలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పేదల ఇళ్లను బాత్‌రూమ్‌లతో పోల్చిన సంస్కారహీనులు ఆ ఇద్దరు‌ : ఎంపీ నందిగం

అమరావతి జేఏసీలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారని మండిపడ్డారు వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌. కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసమే అమరావతి భూముల కోసం..

అమరావతి జేఏసీలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పేదల ఇళ్లను బాత్‌రూమ్‌లతో పోల్చిన సంస్కారహీనులు ఆ ఇద్దరు‌ : ఎంపీ నందిగం
Follow us

|

Updated on: Dec 28, 2020 | 3:19 PM

అమరావతి జేఏసీలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారని మండిపడ్డారు వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌. కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసమే అమరావతి భూముల కోసం ఉద్యమిస్తున్నారని విమర్శించారు. ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు అమరావతి ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు సురేష్‌. పేదవాడికి ఏం చేశారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అమరావతిలోని 29 గ్రామాల ప్రజల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. పేదల ఇళ్లను బాత్‌రూమ్‌లతో పోల్చిన సంస్కారహీనులు చంద్రబాబు, లోకేష్‌ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమరావతి చంద్రబాబు బినామీ రాజధాని అని విమర్శించారు.