వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఇంట తీవ్ర విషాదం…
వైసీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తల్లి సరళ కన్నుమూశారు.
వైసీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తల్లి సరళ కన్నుమూశారు. సంగం మండలం పడమటిపాళెంలో శనివారం ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీధర్ రెడ్డి తల్లి సరళమ్మకు ఎవరు అడిగినా కాదనకుండా సాయం చేసే గుణం ఉండేదని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చెబుతున్నారు. ఆమె లేని లోటు పూడ్చలేనిదని బాధ వ్యక్తం చేస్తున్నారు.
సరళమ్మ మరణంతో పడమటిపాళెంలో విషాదచాయలు అలముకున్నాయి. ఆమె భౌతికకాయానికి పలువురు జిల్లా రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. సరలమ్మ మరణవార్త తెలిసిన వెంటనే మంత్రి గౌతమ్ రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు…శ్రీధర్రెడ్డిని ఫోన్ లో పరామర్శించారు. సరళమ్మకు ఇద్దరు కుమారులుకాగా.. వారు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవలందిస్తున్నారు. శ్రీధర్రెడ్డి నెల్లూరు రూరల్ శాసనసభ్యుడు కాగా.. ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి నియోజకర్గ పార్టీ బాధ్యతల్ని చూసుకుంటున్నారు.