వైఎస్ఆర్ ఆసరా స్కీమ్, రుణాలపై మార్గదర్శకాలు విడుదల
2020-21 ఆర్థిక సంవత్సరానికి వైఎస్ఆర్ ఆసరా పథకం కింద స్వయం సహాయ సంఘాలకు రుణాలపై మార్గదర్శకాలు విడుదలయ్యాయి.
2020-21 ఆర్థిక సంవత్సరానికి వైఎస్ఆర్ ఆసరా పథకం కింద స్వయం సహాయ సంఘాలకు రుణాలపై మార్గదర్శకాలు విడుదలయ్యాయి. బ్యాంకు లింకేజీ రుణాలను 4 విడతల్లో చెల్లించేందుకు గవర్నమెంట్ రెడీ అయ్యింది. 2019 ఏప్రిల్ 11 తేదీ వరకు పెండింగ్లో ఉన్న బ్యాంకు లింకేజీ లోన్స్కు మాత్రమే ఈ వైఎస్ఆర్ ఆసరా స్కీమ్ వర్తిస్తుందని ఏపీ సర్కార్ తెలిపింది. ఏప్రిల్ 11 , 2019 తేదీ కంటే ముందు నిరర్థక ఆస్తులుగా ప్రకటించింది. నిలిపి వేసిన ఎస్హెచ్జీ అకౌంట్లకు ఆసరా పథకం వర్తించదని వెల్లడించింది. స్వయం సహాయ సంఘాలకు ఆసరా స్కీమ్ అమలును క్షేత్రస్థాయిలో సెర్ప్, మెప్మా సంస్థలు పర్యవేక్షిస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది.
Also Read :
మరో కీలక అనుమతి పొందిన ‘కొవాగ్జిన్’ !
పాశవికం : మైనర్పై సామూహిక అత్యాచారం, ఆపై సెప్టిక్ ట్యాంకులో