ఆ అడుగు పడి సరిగ్గా మూడేళ్లు

దేశ రాజకీయాల్లోనే ఓ సంచలనం..చరిత్రాత్మకంగా నిలిచి పోయిన ప్రజా సంకల్ప యాత్రను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించి నేటికి సరిగ్గా మూడేళ్లు.

ఆ అడుగు పడి సరిగ్గా మూడేళ్లు
Follow us

|

Updated on: Nov 06, 2020 | 8:14 AM

ఓ రాజకీయ నాయకుడి యాత్ర దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఓ అద్వితీయ విజయానికి నాంది పలికింది.  చరిత్రాత్మకంగా నిలిచి పోయిన ప్రజా సంకల్ప యాత్రను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించి నేటికి సరిగ్గా మూడేళ్లు. ఇడుపులపాయలో తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి  2017 నవంబర్‌ 6వ తేదీన జగన్‌ ప్రజా సంకల్పానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర చరిత్రలో చెరగని ముద్ర వేసిన ఈ పాదయాత్రలో అలుపెరగని పోరాటం సాగించారు. 14 నెలల పాటు 13 జిల్లాల్లో సుదీర్ఘంగా ప్రజల కష్టాలు వింటూ, నేను విన్నాను..నేను ఉన్నాను అంటూ ముందుకు సాగారు. 2019 జనవరి 9వ తేదీన ఇచ్ఛాపురంలో ఈ యాత్ర ముగిసింది.

13 జిల్లాల్లో 6 నెలల పాటు ఈ యాత్ర సాగుతుందని తొలుత పార్టీ వర్గాలు భావించినా, చివరకు అది 14 నెలల పాటు సాగింది. 2019 జనవరి 9న ఇచ్ఛాపురంలో పాదయాత్రకు స్వస్తీ పలుకుతూ పైలాన్‌ను ఆవిష్కరించారు. మొత్తం 3,648 కిలోమీటర్ల మేర జగన్‌ పాదయాత్రను సాగించారు.  13 జిల్లాలు, 134 నియోజకవర్గాలు, 62 నగరాలు, పట్టణాలు… 231 మండలాల పరిధిలోని 2,516 గ్రామాలలో జగన్‌ పర్యటించారు. 124 భారీ బహిరంగ సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో భాగమయ్యారు. కనిపించిన ప్రతి మనిషిని ఆయన అక్కున చేర్చుకున్నారు. చెప్పుకున్న ప్రతి కష్టాన్ని సావధానంగా విన్నారు. తన ప్రభుత్వం వస్తే సుపరిపాలన అందిస్తానని భరోసా ఇచ్చారు. అధికారం ఇస్తే  తాను చనిపోయిన తర్వాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో బ్రతికుండాలన్న ఆశతో పాలన సాగిస్తానని జగన్‌ ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభ సభలో‌ ప్రజలకు మాట ఇచ్చారు.

ఆపై  ప్రజా సంకల్ప యాత్ర ముగిశాక కూడా జనం మధ్యనే ఉంటూ ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించారు. కని,విని ఎరుగని రీతిలో 151 అసెంబ్లీ, 22 లోక్‌సభా స్థానాల్లో గెలుపొంది ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

Also Read : మాజీ మావోయిస్టు పద్మావతి అలియాస్ పద్మక్క అరెస్ట్

పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్