బ్యాన్ చేసినా ప్రాణాలు తీస్తోన్న ‘పబ్జీ’
ఆన్లైన్ మొబైల్ గేమింగ్ యువతను విడిచిపెట్టడం లేదు. ఒకసారి గేమ్లోకి ప్రవేశిస్తే దానికి బానిసగా మార్చేసుకుంటోంది.
ఆన్లైన్ మొబైల్ గేమింగ్ యువతను విడిచిపెట్టడం లేదు. ఒకసారి గేమ్లోకి ప్రవేశిస్తే దానికి బానిసగా మార్చేసుకుంటోంది. ఈ లాక్డౌన్ సమయంలో ఈ సంఖ్య ప్రమాదకరంగా పెరిగింది. ‘పబ్జీ’ యువతను పెడదారి పట్టిస్తోంది. ఒక రకంగా గేమ్కు బానిసలుగా మారినవారి జీవితాలను శాసిస్తోంది. చివరకు ప్రాణాలను సైతం అలవోకగా తీసుకునేలా ప్రేరేపిస్తోంది. ప్రభుత్వం బ్యాన్ చేసినా ఇంకా వెర్రితలలు వేస్తూనే ఉంది. పిల్లలు ఈ గేమ్ బారిన పడకుండా పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్థానిక నవాబ్పేటలో నివాసం ఉంటున్న ఓ యువకుడు పబ్జీకి బానిసయ్యాడు. మూడు నెలల క్రితం కరోనా లాక్డౌన్ సమయంలో ఇళ్లు గడవడం కష్టంగా మారడంతో తల్లిదండ్రులు పనికి వెళ్లని పురమాయించారు. గేమ్కు దూరం కావాల్సి వస్తుందని ఆ యువకుడు ఇంటి గేటుకి ఉరేసుకుని తనువు చాలించాడు. ప్రపంచవ్యాప్తంగా పబ్జీ ఆడేవాళ్లు సుమారు 20కోట్ల మంది వరకు ఉన్నట్లు గణాంకాలను బట్టి తెలుస్తోంది. దీనికి అలవాటు పడిన వారు చదువులో రాణించలేకపోతున్నారని, నిద్రలేమి, కంటి సమస్యలతో పాటు మానసిక సంఘర్షణతో బాధపడుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ( పిల్లి పిల్ల అనుకుని కొన్నారు..తీరా రెండేళ్ల తర్వాత..! )