Telangana: ఆ సమస్య పరిష్కరించడం లేదని.. ఏకంగా ఆఫీస్‌కు మంచం, దుప్పటితో వచ్చేశారు..

ఖమ్మం జిల్లాలో ఓ మహిళ ఊహించనివిధంగా ఆందోళనకు దిగింది. మంచం, దుప్పట్లు తెచ్చుకునిమరీ తహశీల్దార్‌ ఆఫీస్‌ ముందు మకాం వేసింది.

Telangana: ఆ సమస్య పరిష్కరించడం లేదని.. ఏకంగా ఆఫీస్‌కు మంచం, దుప్పటితో వచ్చేశారు..
Khammam
Follow us

|

Updated on: May 25, 2022 | 9:35 AM

Khammam Nelakondapally: ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఓ కుటుంబం వినూత్నంగా నిరసనకు దిగింది. తమ భూమిని ఇతరుల పేరున రికార్డుల్లోకి ఎక్కించారంటూ తహశీల్దార్‌ ఆఫీస్‌లో ఆందోళనకు దిగారు. మంచం, దుప్పట్లు అన్నీ తీసుకుని వచ్చి, తహశీల్దార్‌ కార్యాలయంలోనే మకాం పెట్టారు. వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం గ్రామానికి చెందిన అరుణకు ఎకరం మూడు కుంటల భూమి ఉంది. వారసత్వంగా అది వాళ్లకు సంక్రమించింది. అయితే, ఆ భూమిని ఇతరుల పేరున రాసేశారు రెవెన్యూ అధికారులు. దాంతో, ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలేమీ వాళ్లకు అందకుండా పోతున్నాయ్. ఉన్నదే కొద్దిపాటి భూమి, అదీ కూడా తమ పేరున లేకుండా చేయడంతో రైతుబంధులాంటి స్కీమ్‌ తమకు అందకుండా పోతోందని అంటోంది బాధిత కుటుంబం. ఏళ్లతరబడి ఆఫీస్‌ చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని బాధితురాలు అరుణ పేర్కొంది.

ఎకరం పొలంపైనే ఆధారపడి తమ కుటుంబం జీవిస్తోందని, తమ భూమికి పట్టా పాస్‌ బుక్‌ ఇప్పించాలని కోరుతోంది బాధిత కుటుంబం. లేదంటే, ఇక్కడ్నుంచి కదిలేది లేదంటూ కొడుకుతో కలిసి తహశీల్దార్‌ ఆఫీస్‌ ముందే మకాం పెట్టింది అరుణ. దీంతో పోలీసులు చేరుకొని వారిని సముదాయించేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా షాకైన అధికారులు సమస్యను పరిష్కరిస్తామని హామీనిచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.