మరణంలోనూ వీడని బంధం : భర్త మరణ వార్త విని భార్య మృతి
కపుల్ గోల్స్. ఈ మధ్య కాస్త ట్రెండీగా వినిపిస్తోన్న పేరు. కానీ ఫోటోలకు పరిమితమైన నవ్వులు. ఒకరి ఫోన్ మరొకరు చూస్తారేమోన్న భయాలు. చిన్న, చిన్న అనర్థాలకే విడాకులు.
కపుల్ గోల్స్. ఈ మధ్య కాస్త ట్రెండీగా వినిపిస్తోన్న పేరు. కానీ ఫోటోలకు పరిమితమైన నవ్వులు. ఒకరి ఫోన్ మరొకరు చూస్తారేమోన్న భయాలు. చిన్న, చిన్న అనర్థాలకే విడాకులు. ఇది ఇప్పటి ట్రెండ్. కానీ ఇప్పుడు చెప్పబోయే భార్యభర్తల గురించి వింటే మీ మనసు కన్నీళ్లు పెడుతుంది.
ఆ దంపతులు ఎప్పుడూ కలిసే ఉండేవారు. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లేవారు. ఒకర్ని విడిచి ఒకరు ఉండలేకపోయారు. చివరికి మరణంలోనూ వీరి బంధం విడిపోలేదు. భర్త చనిపోయాడని తెలియగానే.. భార్య సైతం గుండెపోటుతో ప్రాణాలు వదలింది. ఈ విషాదకర ఘటన ఘటన శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం కొండంపేటలో జరిగింది.
గ్రామానికి చెందిన డాక్టర్ సలాది రామారావు (75) గుండెపోటుతో కన్నుమూశారు. తన భర్త ఇకలేడన్న విషయం తెలియగానే భార్య నిర్మల (65) సైతం తనువు చాలించింది. దీంతో మరణంలోనూ కూడా ఇద్దరూ ఒకర్ని ఒకరు విడిచి ఉండలేక వెళ్లిపోయారంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Also Read :
మరో కీలక అనుమతి పొందిన ‘కొవాగ్జిన్’ !
పాశవికం : మైనర్పై సామూహిక అత్యాచారం, ఆపై సెప్టిక్ ట్యాంకులో