ఆడియో టేపుల కలకలం: వీరిద్దరి మధ్య అసలేం జరుగుతోంది..?
కరీంనగర్లో కాకపుట్టిస్తోన్న కలెక్టర్ ఆడియో టేపుల వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. దానిపై సీఎంవో అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్తో.. తెలంగాణ కలెక్టర్ మాట్లాడిన ఆడియో టేపుల వ్యవహారం.. ఇప్పుడు మళ్లీ హాట్టాపిక్గా మారింది. దానిపై.. కరీంనగర్ జిల్లా కలెక్టర్ స్పందించారు. బండి సంజయ్తో నేను మాట్లాడింది నిజమేనని కలెక్టర్ ఒప్పుకున్నారు. ఆయన.. తనను ఎన్నికల ఖర్చుల గురించి అడిగారని.. నిబంధనల ప్రకారమే వాటిని అప్లోడ్ చేస్తానని చెప్పానని ఆయన […]
కరీంనగర్లో కాకపుట్టిస్తోన్న కలెక్టర్ ఆడియో టేపుల వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. దానిపై సీఎంవో అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్తో.. తెలంగాణ కలెక్టర్ మాట్లాడిన ఆడియో టేపుల వ్యవహారం.. ఇప్పుడు మళ్లీ హాట్టాపిక్గా మారింది. దానిపై.. కరీంనగర్ జిల్లా కలెక్టర్ స్పందించారు. బండి సంజయ్తో నేను మాట్లాడింది నిజమేనని కలెక్టర్ ఒప్పుకున్నారు. ఆయన.. తనను ఎన్నికల ఖర్చుల గురించి అడిగారని.. నిబంధనల ప్రకారమే వాటిని అప్లోడ్ చేస్తానని చెప్పానని ఆయన అన్నారు. ఇదే విషయాన్ని పై అధికారులకూ చెబుతానని కలెక్టర్ సర్ఫరాజ్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా.. తాజాగా.. ఆ ఆడియో టేపుల వివాదంపై మీడియాతో మాట్లాడిన తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్.. ఎన్నికల్లో నన్ను ఓడించడానికి కుట్ర జరిగిందని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఏముంటుందని ప్రశ్నించారు..? దొడ్డిదారిన నాపై వేటు వేసేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. అయితే.. ఈ వివాదంపై ఇప్పుడు తాను మాట్లాడనని.. ప్రభుత్వమే చూసుకుంటుందని అన్నారు.
తాజాగా.. వంశీ, రాజేంద్ర ప్రసాద్ల మధ్య రేగిన పరస్పర ఆరోపణల రగడకు స్వస్తి పలికిన నేపథ్యంలో.. ఆ మధ్య కూడా బీజేపీ ఎంపీ బండి సంజయ్.. తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ల మధ్య తలెత్తిన వివాదాన్ని ఈ సందర్భంగా.. ప్రస్తావించవలసిన అవసరం ఉంది. కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ తవ్వకాలపై ఇద్దరూ.. ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునేంత పరిస్థితి ఏర్పడింది.
నాడు అసలు బండి సంజయ్ ఏమన్నారు..?
- తక్కువ విస్తీర్ణంలో.. క్వారీలకు అనుమతి పొంది.. నిర్ణయించిన హుద్దులను దాటి.. గ్రానైట్ తవ్వుతున్నారు.
- క్వారీల్లో కార్మిక చట్టాలు అమలు కావడం లేదు.
- అధికారులతో కుమ్మక్కై తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు. ఉత్పత్తి చేసిన ప్రతీ క్యూబిక్ మీటర్కు ఎక్కవ మించి వసూలు చేస్తున్నారు.
- కోట్లు రూపాయల పన్నులను ఎగవేస్తున్నారు
- కటింగ్ ఫ్యాక్టరీల్లోనూ జీరో దందా నడిపిస్తున్నారు.
- అడవులు దెబ్బతింటున్నాయి.
- అలాగే.. గుట్టలను పేల్చిన తర్వాత.. ఆ వ్యర్థాలను ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాల్లో పడేస్తున్నారు
- నిబంధనలకు విరుద్ధంగా అధికలోడ్తో గ్రానైట్ వాహకాలు వెళ్తున్నాయి.
- మైనింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో డిస్ర్టిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్టు ఏర్పాటు చేసి వాటి ద్వారా ఎఫెక్టెడ్ ఏరియాల్లో.. అభివృద్ధి పనులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినా బేఖాతరు చేస్తున్నారు.
మరోవైపు గ్రానైట్ వ్యాపారుల కథనం ఇలా ఉంది..!
- గ్రైనైట్ ద్వారా లక్షలాది మంది కార్మికులు ఉఫాధి పొందుతున్నారు
- ఎంపీ చేసిన చర్యల వల్ల పరిశ్రమలు మూతపడితే.. మా కుటుంబాలు రోడ్డున పడాల్చిందే
- ఎంపీ బండి సంజయ్ గ్రానైట్ వ్యాపారులను మాఫియాగా అభిర్ణించడం సరికాదు
- ప్రభుత్వానికి అన్ని రకాల పన్నులను చెల్లిస్తూ వ్యాపారం చేస్తున్నారు
- ఇప్పటికైనా ఎంపీ అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలి.