ఆ హత్యకేసులో సంబంధం ఉందని తేలితే ఉరేసుకుంటా

మాజీ మంత్రి, వైసీపీ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో సిట్ విచారణకు హాజరుకావాలంటూ ఇప్పటికే పలువురు టీడీపీ, వైసీపీ, బీజేపీ పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇందులో ముఖ్యంగా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సిట్ విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చినా.. డుమ్మా కొడుతూ తప్పించుకుంటున్నారన్న వార్తలు ఊపందుకున్న నేపథ్యంలో.. ఆది నారాయణ రెడ్డి స్పందించారు. తానేమీ పారిపోలేదని.. తనకు […]

ఆ హత్యకేసులో సంబంధం ఉందని తేలితే ఉరేసుకుంటా
Follow us

| Edited By:

Updated on: Dec 11, 2019 | 3:05 PM

మాజీ మంత్రి, వైసీపీ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో సిట్ విచారణకు హాజరుకావాలంటూ ఇప్పటికే పలువురు టీడీపీ, వైసీపీ, బీజేపీ పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇందులో ముఖ్యంగా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సిట్ విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చినా.. డుమ్మా కొడుతూ తప్పించుకుంటున్నారన్న వార్తలు ఊపందుకున్న నేపథ్యంలో.. ఆది నారాయణ రెడ్డి స్పందించారు.

తానేమీ పారిపోలేదని.. తనకు సిట్ నోటీసులు ఈరోజే అందజేసిందంటూ తెలిపారు. ఈ కేసులో తన పాత్ర ఉందని తేలితే.. బహరింగ ఉరికి సిద్ధమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సిట్ కాదు.. సీబీఐకి ఈ కేసును అప్పగించాలన్న వైసీపీ.. అధికారంలోకి రాగానే సిట్‌ను ఏర్పాటు చేసిందని మండిపడ్డారు. ఈ కేసును తప్పుదోవ పట్టించే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.

ఇప్పటికే గత కొద్ది రోజులుగా కడప పోలీసు శిక్షణ కేంద్రంలో సిట్.. ఈ కేసుపై ముమ్మరంగా విచారణ సాగిస్తున్న విషయం తెలిసిందే. ఇక సిట్ నోటీసులు అందుకున్న ఆది.. గురువారం ఉదయం విచారణకు హాజరుకానున్నారు.