దోచుకున్నదంతా మీదే..!
మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుపై ట్విట్టర్లో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్ వేశారు. యనమల గారూ.. మీరు అడగడం, మేం ఇవ్వడం మొదలు పెడితే.. లోకేష్ కోసం ప్రకాశం బ్యారేజ్, చంద్రబాబు కోసం పోలవరం ప్రాజెక్టు, ఇవ్వమని అడగగల సమర్ధులు మీరని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు వైసీపీ నేత విజయసాయి రెడ్డి. కాగా.. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా..? అని చంద్రబాబును ఉద్ధేశించి ప్రశ్నించారు. కుప్పం, చంద్రగిరిలో నాయకులు అడ్డగోలుగా దోచుకోవడం వల్లే […]
మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుపై ట్విట్టర్లో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్ వేశారు. యనమల గారూ.. మీరు అడగడం, మేం ఇవ్వడం మొదలు పెడితే.. లోకేష్ కోసం ప్రకాశం బ్యారేజ్, చంద్రబాబు కోసం పోలవరం ప్రాజెక్టు, ఇవ్వమని అడగగల సమర్ధులు మీరని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు వైసీపీ నేత విజయసాయి రెడ్డి.
కాగా.. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా..? అని చంద్రబాబును ఉద్ధేశించి ప్రశ్నించారు. కుప్పం, చంద్రగిరిలో నాయకులు అడ్డగోలుగా దోచుకోవడం వల్లే ప్రజలు పార్టీకి దూరమయ్యారని, సమీక్షలో మీరు ఆవేదన చెందినట్టు మీడియాలో చూసి అంతా నవ్వుకుంటున్నారని అన్నారు. జన్మభూమి కమిటీలలో పచ్చ మాఫియాను సృష్టించి ఇప్పుడు నీతులు చెబితే ఏం లాభమని అన్నారు.
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా చంద్రబాబు గారూ? కుప్పం, చంద్రగిరిలో నాయకులు అడ్డగోలుగా దోచుకోవడం వల్లే ప్రజలు పార్టీకి దూరమయ్యారని సమీక్షల్లో మీరు ఆవేదన చెందినట్టు మీడియాలో చూసి అంతా నవ్వుకుంటున్నారు. జన్మభూమి కమిటీలనే పచ్చ మాఫియాను సృష్టించి ఇప్పుడు నీతులు చెబితే ఏం లాభం?
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 7, 2019
యనమల గారూ… మీరు అడగటం, మేం ఇవ్వటం మొదలుపెడితే లోకేష్ కోసం ప్రకాశం బ్యారేజీ, చంద్రబాబు కోసం పోలవరం ప్రాజెక్టు కూడా ఇవ్వమని అడగగల సమర్ధులు మీరు!
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 7, 2019