దేవరకొండ సమర్పించు ‘మీకు మాత్రమే చెప్తా’..
‘అర్జున్ రెడ్డి’ సినిమాతో సౌత్ సెన్సేషన్గా పేరు తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ.. తన నటన, యాటిట్యూడ్తో మరింత స్టార్డమ్ను సొంతం చేసుకున్నాడు. తాజాగా కొత్తవారికి అవకాశం ఇవ్వడానికి ‘కింగ్ ఆఫ్ ది హిల్’ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ను స్థాపించి యంగ్ టాలెంట్ను ప్రోత్సహించడానికి తొలి అడుగు వేశాడు. ‘పెళ్లి చూపులు’తో విజయ్ టాలీవుడ్లో చెరిగిపోని ముద్రను వేసుకున్నాడు. హీరోగా ఎదగడంలో తను పడ్డ కష్టాలు తెలుసు కాబట్టే.. కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు. […]
‘అర్జున్ రెడ్డి’ సినిమాతో సౌత్ సెన్సేషన్గా పేరు తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ.. తన నటన, యాటిట్యూడ్తో మరింత స్టార్డమ్ను సొంతం చేసుకున్నాడు. తాజాగా కొత్తవారికి అవకాశం ఇవ్వడానికి ‘కింగ్ ఆఫ్ ది హిల్’ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ను స్థాపించి యంగ్ టాలెంట్ను ప్రోత్సహించడానికి తొలి అడుగు వేశాడు. ‘పెళ్లి చూపులు’తో విజయ్ టాలీవుడ్లో చెరిగిపోని ముద్రను వేసుకున్నాడు. హీరోగా ఎదగడంలో తను పడ్డ కష్టాలు తెలుసు కాబట్టే.. కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు.
దర్శకుడు తరుణ్ భాస్కర్ లీడ్ రోల్లో విజయ్ దేవరకొండ నిర్మాతగా వస్తున్న కొత్త చిత్రానికి ‘మీకు మాత్రమే చెప్తా’ అనే టైటిల్ను ఖరారు చేస్తూ అనౌన్స్మెంట్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలోనే కావాల్సినంత ఫన్ను వారిద్దరూ ప్రేక్షకులకు పంచారు. కాగా త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియజేస్తారట.