కరోనా బారినపడ్డ ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి.. స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన త్రివేంద్రసింగ్ రావత్
కరోనా కట్టడికి ఓ వైపు ప్రయోగాలు తుది దశకు చేరుకుంటుంటే, మరోవైపు వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంది. తాజాగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
కరోనా కట్టడికి ఓ వైపు ప్రయోగాలు తుది దశకు చేరుకుంటుంటే, మరోవైపు వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంది. తాజాగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కొద్దిపాటి లక్షణాలు ఉన్న ఆయన, కోవిడ్-19 పరీక్ష చేయించుకోగా పాజిటివ్గా తేలినట్లు వైద్యులు తెలిపారు. తానూ కరోనా బారినపడినట్లు ట్వీట్టర్లో శుక్రవారం ఆయన స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం తనకు కరోనా లక్షణాలేవి లేవని, ఆరోగ్యంగానే ఉన్నానని పేర్కొన్నారు. వైద్యుల సలహా మేరకు స్వీయ నిర్బంధంలోనే ఉంటున్నట్లు వెల్లడించారు. ఇటీవల తనను కలిసేందుకు వచ్చిన వారు కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకొని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రావత్ సూచించారు. అయితే, కొంతకాలంపాటు ఇంటి నుంచే రాష్ట్ర పరిపాలనా సంబంధమైన విషయాలను చక్కబెట్టనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
“Uttarakhand Chief Minister Trivendra Singh Rawat tests positive for #COVID19“, tweets Uttarakhand CM. pic.twitter.com/mELVwgzU1x
— ANI (@ANI) December 18, 2020