Murder : యూపీలో దారుణం.. కుక్కలను సరిగా చూసుకోవడం లేదని.. సొంత చెల్లినే కడతేర్చాడు
సమాజం ఎటు వెళ్తుందో అర్థం కావట్లేదు. కనీసం ఎమోషన్స్ ఉండటం లేదు. మినిమల్ వాల్యూస్ పాటించడం లేదు. చిన్న, చిన్న విషయాలకే ఆత్మహత్యలు..హత్యలు ఎక్కువైపోతున్నాయి.
సమాజం ఎటు వెళ్తుందో అర్థం కావట్లేదు. కనీసం ఎమోషన్స్ ఉండటం లేదు. మినిమల్ వాల్యూస్ పాటించడం లేదు. చిన్న, చిన్న విషయాలకే ఆత్మహత్యలు..హత్యలు ఎక్కువైపోతున్నాయి. మున్ముందు ఈ విపరీత ధోరణి ఇంకెంత దూరం తీసుకుపోతుందో తెలియడం లేదు. తాజాగా అలాంటి ఘటనే మీరట్లో జరిగింది. ఇంట్లో ఉన్న పెంపుడు కుక్కలను చూసుకునేందుకు నిరాకరించిందనే చిన్న కారణంతో కోపోద్రేక్తుడైన ఓ అన్న తన సొంత చెల్లెలిని కాల్చి చంపాడు.
వివరాల్లోకి వెళ్తే.. మీరట్ నగరంలోని భవన్పూర్ ఏరియాలో చెందిన ఆశిష్(25), పారుల్ (23) అన్నాచెల్లెలు నివశిస్తున్నారు. వారికి 20 వరకు పెంపుడు కుక్కలున్నాయి. అయితే, ఆ కుక్కల సంరక్షణ జాగ్రత్తగా చూసుకోవాలిని ఆశిష్..పారుల్ను తరుచూ కోరేవాడు. అన్నింటిని చూసుకోవడం తన వల్ల కాదని ఆమె చెప్తూ వచ్చేది. తాజాగా కుక్కలకు రొట్టెలు చేసి పెట్టే విషయంలో ఆశిష్, పారుల్ మధ్య గొడవ చెలరేగింది. ఆగ్రహించిన ఆశిష్.. చెల్లెలు అని కూడా చూడకుండా పారుల్ను తుపాకీతో కాల్చి చంపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్కు చేరుకొని ఆశిష్ను అదుపులోకి తీసుకున్నారు. రెండు డజన్లకు పైగా కుక్కలను చూసుకోవడానికి నిరాకరించడంతోనే నిందితుడు తన సోదరిని చంపాడని పోలీసులు వెల్లడించారు.
Also Read :