పొంచివున్న జలప్రళయం.. ఐరాస నివేదిక హెచ్చరిక

భూతలానికి పెను గండం రాబోతోంది. రాబోతున్న కాలంలో నగరానికి ఆనుకుని ఉన్న సాగరాలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించబోతున్నాయని ఐరాస ముసాయిదా నివేదిక చెబుతోంది. సముద్ర మట్టాలు పెరిగిపోయి, తీర ప్రాంతం వెంబడి ఉన్న అనేక మహానగరాల్లో జలప్రళయం తప్పదని, కోట్ల మంది నిరాశ్రయులవుతారని ఈ నివేదిక తెలుపుతోంది. కరుగుతున్న మంచు కారణంగా ప్రధానంగా చైనా, అమెరికా, ఐరోపా, భారత్‌లకు ముప్పు తప్పదని హెచ్చరిస్తోంది. సాగర తీరాలు పెరగడంతో భారత నగరాలకు ప్రమాదం పొంచి ఉందని తెలిపింది. ఐరాసకు […]

పొంచివున్న జలప్రళయం.. ఐరాస నివేదిక హెచ్చరిక
Follow us

| Edited By:

Updated on: Aug 31, 2019 | 2:02 PM

భూతలానికి పెను గండం రాబోతోంది. రాబోతున్న కాలంలో నగరానికి ఆనుకుని ఉన్న సాగరాలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించబోతున్నాయని ఐరాస ముసాయిదా నివేదిక చెబుతోంది. సముద్ర మట్టాలు పెరిగిపోయి, తీర ప్రాంతం వెంబడి ఉన్న అనేక మహానగరాల్లో జలప్రళయం తప్పదని, కోట్ల మంది నిరాశ్రయులవుతారని ఈ నివేదిక తెలుపుతోంది. కరుగుతున్న మంచు కారణంగా ప్రధానంగా చైనా, అమెరికా, ఐరోపా, భారత్‌లకు ముప్పు తప్పదని హెచ్చరిస్తోంది. సాగర తీరాలు పెరగడంతో భారత నగరాలకు ప్రమాదం పొంచి ఉందని తెలిపింది. ఐరాసకు చెందిన ఇంటర్ గవర్నమెంట్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్(ఐపీసీసీ) ఈ నివేదికను తయారు చేయడం ఈ సంవత్సరంలో ఇది నాలుగోసారి.

కేవలం భూతాపాన్ని 1.5 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గించడం, అడవులు, ప్రపంచ ఆహార వ్యవస్థ వంటి అంశాల గురించి మాత్రమే ఇంతకు ముందున్న నివేదికలు తెలిపాయి. అయితే ఇలాంటి విధ్వంసాలు జరగకుండా ఉండాలంటే ప్రజల జీవన శైలిలో మార్పు రావాలి. క్లైమేట్ చేంజ్ పై ప్రపంచ దేశాలు స్పందించి సత్వర చర్యలు తీసుకోవాలి. గ్లోబల్ హీట్ ను తగ్గించడానికి తప్పనిసరిగా పూనుకోవలిసిందే. హిమాలయాలతో సహా అంటార్కిటికా వంటి ఖండాల్లో మంచు క్రమేపి కరిగిపోతూ పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ నేపథ్యంతో ఈ నివేదిక రూపకల్పన అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక తాజాగా సిద్ధమైన నివేదికను పరిశీలించడానికి సెప్టెంబర్‌లో ప్రపంచ దేశాల ప్రతినిధులు మొనాకోలో సమావేశం కానున్నారు. ఐపీసీసీ నివేదిక ప్రకారం భారత్‌లో విధ్వంసకర మార్పులు ఇప్పటికే ఆరంభమయ్యాయని తెలుస్తోంది. మత్స్య సంపద క్రమంగా తగ్గిపోతుండటం ఉదాహరణగా తెలుస్తోంది. ఇక తుఫాను వల్ల కలిగే నష్టం వంద రెట్లు కన్నా ఎక్కువగా పెరుగుతోంది.