బంజారాహిల్స్లో కలకలం, గోనెసంచిలో మృతదేహం
హైదరాబాద్ నగరంలో కలకలం చెలరేగింది. బంజారాహిల్స్లోని రోడ్ నెం.2లో ఫుట్పాత్పై ఓ గోనె సంచిలో వృద్ధురాలి మృతదేహం లభ్యం కావడం సంచలనంగా మారింది.
హైదరాబాద్ నగరంలో కలకలం చెలరేగింది. బంజారాహిల్స్లోని రోడ్ నెం.2లో ఫుట్పాత్పై ఓ గోనె సంచిలో వృద్ధురాలి మృతదేహం లభ్యం కావడం సంచలనంగా మారింది. అందులోని శవం ఓ దుప్పటిలో చుట్టి ఉంది. గుర్తు తెలియని వ్యక్తుల దుప్పటిలో చుట్టిన డెడ్బాడీని గోనెసంచిలో వదిలిపెట్టి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కొవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని గోనెసంచిని తెరిచారు. చనిపోయిన వృద్ధ మహిళ ఎవరనే దానిపై వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. స్థానికంగా ఉన్న సీసీ టీవీ విజువల్స్ పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఎవరైనా వ్యాధితో చనిపోతే అలా వదిలేసి వెళ్లారా లేక చంపి అక్కడ పడేసి వెళ్లారా అనే కోణాల్లో విచారణ జరుపుతున్నారు. పోస్టుమార్టం జరిపితే అసలు విషయం తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు. ఐపీసీ సెక్షన్ 174 ప్రకారం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు బంజారాహిల్స్ సీఐ కళింగరావు చెప్పారు.
Also Read :
‘డియర్ కామ్రేడ్’ అరుదైన ఘనత : ఇండియాలోనే నెం.1