లండన్ నుంచి శివుడి విగ్రహం మళ్ళీ మన చెంతకు
రాజస్తాన్ లోని బరౌలీలో గల ఘటేశ్వరాలయం నుంచి 1998 లో కొందరు స్మగ్లర్లు శివుడి విగ్రహాన్ని దోచుకుపోయారు. దీన్ని వారు బ్రిటన్ కి స్మగుల్ చేశారన్న విషయం 2003 నాటికి గానీ బయటపడలేదు. అరుదైన. తొమ్మిదో శతాబ్దానికి..
రాజస్తాన్ లోని బరౌలీలో గల ఘటేశ్వరాలయం నుంచి 1998 లో కొందరు స్మగ్లర్లు శివుడి విగ్రహాన్ని దోచుకుపోయారు. దీన్ని వారు బ్రిటన్ కి స్మగుల్ చేశారన్న విషయం 2003 నాటికి గానీ బయటపడలేదు. అరుదైన. తొమ్మిదో శతాబ్దానికి చెందిన ఈ నటరాజ విగ్రహం నాలుగు అడుగుల ఎత్తు ఉంది. దీని చోరీ విషయాన్ని అధికారులు లండన్ కి తెలియజేయగా.. అక్కడి ఓ ప్రయివేటు వ్యక్తి ఒకరు 2005 లో భారత హైకమిషన్ కి తిరిగి ఇచ్చారు. 2017 ఆగస్టులో భారత పురావస్తు అధికారుల బృందం లండన్లోని ఇండియా హౌస్ ని సందర్శించి ఇది ఘటేశ్వరాలయం నుంచి దొంగిలించబడినదే అని నిర్ధారించింది. త్వరలో ఈ విగ్రహం మళ్ళీ ఇండియా చేరనుంది.
ఇదేగాక ఇండియా నుంచి స్మగుల్ అయిన వివిధ దేవతా మూర్తుల విగ్రహాలు అమెరికా, జర్మనీ, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ వంటి దేశాలకు చేరగా ఆయా దేశాలు వాటిని భారత్ కి మళ్ళీ అప్పగించాయి.