మోదీ సర్కార్ గుడ్ న్యూస్… ఉద్యోగ్ ఆధార్ తో సులభంగా రుణాలు!

కేంద్ర ప్రభుత్వం చిరు వ్యాపారులకు సులభంగానే రుణాలు అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్ఎంఈలు, ఎంఎస్ఎంఈలు ఇప్పుడు త్వరితగతిన రుణాలు పొందొచ్చు. దీని కోసం మోదీ సర్కార్ ఉద్యోగ్ ఆధార్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. గతంలో మీరు ఏదైనా వ్యాపారం ప్రారంభించాలి, ఎస్ఎస్ఐ రిజిస్ట్రేషన్ లేదా ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ పొందాలంటే చాలా తతంగం ఉండేది. చాలా డాక్యుమెంట్లు అవసరమయ్యేవి. అయితే ఇప్పుడు మీరు కేవలం 2 ఫామ్స్‌ను ఫిల్ చేస్తే సరిపోతుంది. ఎంట్రప్రెన్యూర్ మెమోరాండమ్ 1, ఎంట్రప్రెన్యూర్ […]

మోదీ సర్కార్ గుడ్ న్యూస్... ఉద్యోగ్ ఆధార్ తో సులభంగా రుణాలు!
Follow us

| Edited By: Srinu

Updated on: Oct 11, 2019 | 3:58 PM

కేంద్ర ప్రభుత్వం చిరు వ్యాపారులకు సులభంగానే రుణాలు అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్ఎంఈలు, ఎంఎస్ఎంఈలు ఇప్పుడు త్వరితగతిన రుణాలు పొందొచ్చు. దీని కోసం మోదీ సర్కార్ ఉద్యోగ్ ఆధార్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. గతంలో మీరు ఏదైనా వ్యాపారం ప్రారంభించాలి, ఎస్ఎస్ఐ రిజిస్ట్రేషన్ లేదా ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ పొందాలంటే చాలా తతంగం ఉండేది. చాలా డాక్యుమెంట్లు అవసరమయ్యేవి. అయితే ఇప్పుడు మీరు కేవలం 2 ఫామ్స్‌ను ఫిల్ చేస్తే సరిపోతుంది. ఎంట్రప్రెన్యూర్ మెమోరాండమ్ 1, ఎంట్రప్రెన్యూర్ మెమోరాండమ్ 2 అనే రెండు ఫారాలను వివరాలతో నింపితే సులభంగానే లోన్ పొందొచ్చు. గతంలో 11 రకాల డాక్యుమెంట్లు అవసరమయ్యేది.

ఉద్యోగ్ ఆధార్ రిజిస్ట్రేషన్ అనేది పూర్తి ఆన్‌లైన్ ప్రక్రియ. దీంతో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రభుత్వ సబ్సిడీ సహా ఇతర ప్రయోజనాలు కూడా పొందొచ్చు. సులభంగానే రుణ ఆమోదం లభిస్తుంది. ఐయామ్ ఎస్ఎంఈ ఆఫ్ ఇండియా చైర్మన్ రాజీవ్ చావ్లా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఎస్ఎంఈ, ఎంఎస్ఎంఈల కోసం వివిధ రకాల సంక్షేమ, సబ్సిడీ పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. ఇప్పుడు ఉద్యోగ్ ఆధార్ రిజిస్ట్రేషన్‌తో ప్రభుత్వ బెనిఫిట్స్‌ను ఎస్ఎంఈలు సులభంగా పొందొచ్చని తెలిపారు.

ఉద్యోగ్ ఆధార్ రిజిస్ట్రేషన్‌లో ఎస్ఎంసీ లేదా ఎంఎస్ఎంఈ యూనిట్ పేరు నమోదు చేసిన తర్వాత వారికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు లభిస్తాయని తెలిపారు. సులభంగా లోన్, గ్యారంటీ లేకుండా రుణం, సబ్సిడీ రేటుకే రుణాలు వంటి బెనిఫిట్స్ అందుతాయని పేర్కొన్నారు. అంతేకాకుండా వీళ్లు ప్రభుత్వపు మైక్రో బిజినెస్ లోన్స్ ఇతర ప్రయోజనాలు కూడా పొందొచ్చని తెలిపారు. ఉద్యోగ్ ఆధార్ రిజిస్ట్రేషన్ కోసం కేవలం 3-4 నిమిషాలు పడుతుందన్నారు. ఆధార్ లేదా ఎంఎస్ఎంఈ వెబ్‌సైట్స్‌కు వెళ్లి నమోదు చేసుకోవచ్చు.