Khammam road accident: ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీకొన్న బైక్.. ఇద్దరు యువకుల మృతి..

వేగంగా వచ్చిన బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు

Khammam road accident: ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం..  చెట్టును ఢీకొన్న బైక్.. ఇద్దరు యువకుల మృతి..
Follow us

|

Updated on: Jan 02, 2021 | 8:57 AM

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కామేపల్లి మండలంలో చెట్టును ఢీకొని ఇద్దరు యువకుల దుర్మరణం. వేగంగా వచ్చిన బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడి చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయారు. కామేపల్లి మండలం పొన్నెకల్‌ గ్రామశివారులోని బుగ్గవాగు వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. స్నేహితుడి వివాహానికి హాజరై.. రాత్రి తిరిగి వస్తుండగా బుగ్గవాగు మూలమలుపు వద్ద బైక్‌ అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. దీంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఖమ్మం జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఇద్దరు యువకులు తెల్లవారుజామున మృతి చెందారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులను పండితాపురం గ్రామానికి చెందిన వెంకటేశ్‌ (24), సాయి (23) గా గుర్తించారు.