మహబూబ్నగర్ జిల్లాలో కల్తీ కల్లు కలకలం, తాగిన కొద్దిసేపటికే ప్రాణాలు విడిచిన ఇద్దరు వ్యక్తులు
మహబూబ్నగర్ జిల్లాలో కల్తీ కల్లు మళ్లీ పడగ విప్పుతోంది. తాజాగా ఇద్దరు యువకులను కల్తీకల్లు బలి తీసుకోవడంతో ఒక్కసారిగా కలవరం మొదలైంది.
మహబూబ్నగర్ జిల్లాలో కల్తీ కల్లు మళ్లీ పడగ విప్పుతోంది. తాజాగా ఇద్దరు యువకులను కల్తీకల్లు బలి తీసుకోవడంతో ఒక్కసారిగా కలవరం మొదలైంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణానికి చెందిన ఖాసీం, వెంకటేశ్ అనే ఇద్దరు యువకులు, మరో వ్యక్తి శ్రీనివాస్తో కలిసి జడ్చర్ల సమీపంలో ఉన్న ఆలూరు గ్రామంలో కల్లు తాగారు. కాసేపటి తర్వాత వారు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని 108 ద్వారా జడ్చర్లకు తరలించారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే వెంకటేష్, కాశీం మృతి చెందారు. మరో వ్యక్తి శ్రీనివాస్ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. వెంకటేష్, కాశీం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వాసుపత్రి కి తరలించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఆలూరు గ్రామానికి వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. ఎక్సైజ్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడంతో కల్తీకల్లు మరోమారు పడగ విప్పుతూ ప్రజల ప్రాణాలు తీస్తుందని స్థానికులు మండిపడుతున్నారు.
Also Read :
Bigg Boss Telugu 4 : మనసులోని భావాలను బయటపెట్టిన అభిజిత్..ఈ విషయం అస్సలు ఊహించి ఉండరు
Bigg Boss Telugu 4 : మరోసారి వివాదం రేపిన రాహుల్ సిప్లిగంజ్ పోస్ట్..సోహైల్పై షాకింగ్ కామెంట్స్
కొండంత ట్రాఫిక్..శ్రీశైలంలో పద్మవ్యూహంలో చిక్కుకున్న భక్తులు..5 కిలోమీటర్ల మేర జామ్
లాక్డౌన్ సమయంలో చెక్పోస్టుల వద్ద గంజాయి స్మగ్లర్లతో స్నేహం, ఆపై ఏఆర్ కానిస్టేబుల్ ఏం చేశాడంటే