ఇష్టంతోనే పోలీస్ స్టేషన్ నుంచి ఏకే-47 చోరీ..ట్విస్టులే ట్విస్టులు
సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో ఇటీవల ఓ వ్యక్తి ఏకే-47తో కాల్పులు జరపడం కలకలం సృష్టించింది. ఈ కేసు విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. గన్స్పై మోజుతో ఏకంగా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ నుంచే తుపాకీ దొంగతనం చేసిన సదానందం అనే వ్యక్తి..దాన్ని ఎలా యూజ్ చెయ్యాల్ యూట్యూబ్లో నేర్చుకున్నట్టు పోలీసుల రిమాండ్ రిపోర్టులో తేలింది. నిత్యం దాన్ని కొబ్బరినూనెతో శుభ్రం చేస్తూ, బుల్లెట్లు లేకుండా గన్ని నొక్కి నిందితుడు మురిసిపోయేవాడట. 2016లో ఏకే 47 మిస్సయ్యింది. […]
సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో ఇటీవల ఓ వ్యక్తి ఏకే-47తో కాల్పులు జరపడం కలకలం సృష్టించింది. ఈ కేసు విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. గన్స్పై మోజుతో ఏకంగా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ నుంచే తుపాకీ దొంగతనం చేసిన సదానందం అనే వ్యక్తి..దాన్ని ఎలా యూజ్ చెయ్యాల్ యూట్యూబ్లో నేర్చుకున్నట్టు పోలీసుల రిమాండ్ రిపోర్టులో తేలింది. నిత్యం దాన్ని కొబ్బరినూనెతో శుభ్రం చేస్తూ, బుల్లెట్లు లేకుండా గన్ని నొక్కి నిందితుడు మురిసిపోయేవాడట. 2016లో ఏకే 47 మిస్సయ్యింది. అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు..దర్యాప్తును అంత సీరియస్గా తీసుకోలేదు.
తాజాగా సదానందం, గంగరాజు అనే మరో వ్యక్తి మధ్య ఇటుకల గురించి గొడవ సందర్భంగా కాల్పులు జరపడంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఫైరింగ్లో గంగరాజు కొద్దిలో బుల్లెట్ గాయం కాకుండా తప్పించుకున్నాడు. తాజా కేసులో సదానందాన్ని విచారించడంతో..అప్పట్లో హుస్నాబాద్లో మిస్సయ్యిన ఏకే 47, కార్బన్ గన్తో పాటు 25 బుల్లెట్లు కూడా లభ్యమయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం విచారణను వేగవంతం చేశాారు పోలీసులు.