ప్రమాదంలో యువకుడు : కాపాడిన టీవీ9 టీమ్
టీవీ9 మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకుంది. రాత్రి బైక్పై వెళ్తూ దారి తప్పి మూసీ నదిలో పడిపోయిన ఓ వ్యక్తిని కాపాడింది. మూసీలో రెండు గంటలపాటు నరకయాతన అనుభవించిన వ్యక్తిని.. పోలీసుల సాయంతో కాపాడింది టీవీ9 టీమ్. బుధవారం రాత్రి మూసీలో పడిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న బాధితుడికి ఫోన్లో మనోధైర్యమిస్తూ.. క్షేమంగా బయటకు వచ్చేంత వరకు అండగా నిలబడింది. ఉప్పల్ సమీపంలోని ఎల్ఎన్టీ ఫ్యాక్టరీ వద్ద అర్థరాత్రి బైక్ ప్రమాదం చోటుచేసుకుంది. బైక్పై వెళ్తుండగా […]
టీవీ9 మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకుంది. రాత్రి బైక్పై వెళ్తూ దారి తప్పి మూసీ నదిలో పడిపోయిన ఓ వ్యక్తిని కాపాడింది. మూసీలో రెండు గంటలపాటు నరకయాతన అనుభవించిన వ్యక్తిని.. పోలీసుల సాయంతో కాపాడింది టీవీ9 టీమ్. బుధవారం రాత్రి మూసీలో పడిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న బాధితుడికి ఫోన్లో మనోధైర్యమిస్తూ.. క్షేమంగా బయటకు వచ్చేంత వరకు అండగా నిలబడింది.
ఉప్పల్ సమీపంలోని ఎల్ఎన్టీ ఫ్యాక్టరీ వద్ద అర్థరాత్రి బైక్ ప్రమాదం చోటుచేసుకుంది. బైక్పై వెళ్తుండగా ప్రమాదవశాత్తూ మూసీ నదిలో ప్రదీప్ అనే వ్యక్తి పడిపోయాడు. హెచ్ఎస్పీసీలో ఉద్యోగిగా పనిచేస్తున్న ప్రదీప్. రాత్రి రెండు గంటపాటు మూసీలోనే నరకయాతన అనుభవించాడు. డయల్ 100కు సమాచారం ఇచ్చినా ఫలితం లేకపోవడంతో టీవీ9కి ఆ యువకుడు ఫోన్ చేయగా.. ఉప్పల్ పోలీసుల సహకారంతో టీవీ9 బృందం రెస్య్కూ ఆపరేషన్లో పాల్గొంది. మొత్తానికి ప్రదీప్ క్షేమంగా బయటపడ్డాడు. బాధ్యతాయుతంగా వ్యవహరించినందుకు టీవీ9 టీమ్ని పలువురు ప్రశంసిస్తున్నారు. ప్రదీప్, అతని మిత్రులు టీవీ9కు, పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.