భార‌తీయ ముస్లింల‌ను ప్ర‌భావితం చేసేందుకు ట‌ర్కీ ప్రెసిడెంట్ పన్నాగాలు

భారతీయ ముస్లింలను సమూలంగా మార్చడానికి టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ టర్కీ ఇంటెలిజెన్స్‌కు భారీగా నిధులు కేటాయించారు. ఇందుకోసం ఐసిస్ కార్యకర్తల నుంచి ప్ర‌త్యేక బోధకులను నియ‌మించారు.

భార‌తీయ ముస్లింల‌ను ప్ర‌భావితం చేసేందుకు ట‌ర్కీ ప్రెసిడెంట్ పన్నాగాలు
Follow us

|

Updated on: Aug 14, 2020 | 3:58 PM

భారతీయ ముస్లింలను సమూలంగా మార్చడానికి టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ టర్కీ ఇంటెలిజెన్స్‌కు భారీగా నిధులు కేటాయించారు. ఇందుకోసం ఐసిస్ కార్యకర్తల నుంచి ప్ర‌త్యేక బోధకులను నియ‌మించారు. భారత భద్రతా బ‌ల‌గాల‌ నివేదిక ప్రకారం, సిరియాలోని ఐసిస్, దాని అనుబంధ సంస్థలను టర్కీ స్పాన్సర్ చేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లో ఐఎస్-కెపిని పాకిస్తాన్ ఎంక‌రేజ్ చేస్తున్న‌ట్లుగానే ట‌ర్కీ కూడా ఆ త‌ర‌హా చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతుంది. ఎర్డోగాన్, ఇస్లామిక్ ప్రపంచంపై సౌదీ నాయకత్వాన్ని దించే ప్రయత్నంలో, పాకిస్తాన్‌తో చెలిమి చేస్తున్నాడు. ఈ క్ర‌మంలో ఆయా దేశాల నుంచి అందుతోన్న‌ నివేదికలపై భారత భద్రతా అధికారులు కూడా ఆందోళన చెందుతున్నారు.

ఇప్ప‌టికే టర్కీ యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో ఏడాది కాలంగా భారత వ్యతిరేక ప్రచారాల జోరు పెరిగింది. కాశ్మీర్ అంశంపై వరుసగా చిన్న, పెద్ద స్థాయి కాన్ఫరెన్సులు, సెమినార్లను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలకు టర్కీలో పాక్ రాయబారి సైరస్ సజ్జాద్ క్వాజీ కూడా హాజరవుతున్నారు. ఇక ఇందుకు పాకిస్థాన్ ఐఎస్ఐ సైతం మద్దతునిస్తోంది. టర్కీలోని పాకిస్తాన్ మిషన్, పాకిస్తాన్ స్పాన్సర్ చేసిన ఎన్జీఓలు, పాకిస్తాన్ ప్రాక్సీల సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. 2019 ఆగస్టు 5 నుంచి టర్కీ విశ్వవిద్యాలయాలలో కాశ్మీర్‌పై 30 కి పైగా సమావేశాలు,సెమినార్లు నిర్వహించిన‌ట్లు తెలుస్తోంది.

Also Read : బీజేపీ నేత సాధినేని యామినిపై పోలీసు కేసు

Also Read : ఏపీ విద్యార్థుల‌కు గుడ్ న్యూస్ : ఈ నెలలో ఒకేసారి 90 గుడ్లు పంపిణీ