పృథ్వీ ఆడియోటేపుల వ్యవహారంపై టీటీడీ చైర్మన్ ఆరా! విచారణకు ఆదేశం
ఎస్వీబీసీ చైర్మన్, నటుడు పృథ్వీ ఆడియోటేపు వ్యవహారంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆరా తీశారు. ఇదే విషయంపై పృథ్వీతో మాట్లాడారు టీటీడీ చైర్మన్. దీనిపై స్పందించిన పృథ్వీ.. ఆ ఆడియో తనది కాదన్నారు. అయితే.. ఆడియో టేపుల వ్యవహారం నా దృష్టికి వచ్చిందని, నిజ నిర్థారణపై విచారణకు ఆదేశించారు వైవీ సుబ్బారెడ్డి. విచారణ జరిపి వాస్తవాలను బయట పెట్టాలని టీటీడీ సీవీఎస్వోకు ఆదేశించామన్నారు. వాస్తవమేనని తేలితే.. సీఎంతో చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు. తప్పులు జరిగితే ఉపేక్షించేది […]
ఎస్వీబీసీ చైర్మన్, నటుడు పృథ్వీ ఆడియోటేపు వ్యవహారంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆరా తీశారు. ఇదే విషయంపై పృథ్వీతో మాట్లాడారు టీటీడీ చైర్మన్. దీనిపై స్పందించిన పృథ్వీ.. ఆ ఆడియో తనది కాదన్నారు. అయితే.. ఆడియో టేపుల వ్యవహారం నా దృష్టికి వచ్చిందని, నిజ నిర్థారణపై విచారణకు ఆదేశించారు వైవీ సుబ్బారెడ్డి. విచారణ జరిపి వాస్తవాలను బయట పెట్టాలని టీటీడీ సీవీఎస్వోకు ఆదేశించామన్నారు. వాస్తవమేనని తేలితే.. సీఎంతో చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు. తప్పులు జరిగితే ఉపేక్షించేది లేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
మహిళా ఉద్యోగినితో ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ అసభ్యకరంగా మాట్లాడాడంటూ.. ఓ ఫోన్ కాల్ రికార్డింగ్ వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఆడియో టేపుల వ్యవహారం టీటీడీ చైర్మన్ వరకూ వెళ్లింది. దీనిపై పృథ్వీ కూడా స్పందించారు. తాను ఏ ఉద్యోగినితో ఫోన్లో మాట్లాడలేదని.. ఆ ఆడియోలో ఉన్న వాయిస్ కూడా తనది కాదన్నారు. తాను ఎస్వీబీసీ చైర్మన్ అవ్వడం చాలామందికి ఇష్టం లేదని, అందుకే కావాలని ఇలాంటి వివాదాల్లోకి ఇరికిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫోన్ కాల్ వివాదంపై విచారణకు సిద్దమేనన్న పృథ్వీ, తప్పుచేశానని తేలితే ఎటువంటి శిక్ష వేసినా శిరసావహిస్తానన్నారు. మహిళల పట్ల ఎంతో గౌరవంగా మెలుగుతానని, ఆ విషయం ఉద్యోగులకు కూడా తెలుసన్నారు. తనలో ఎటువంటి అసభ్య ప్రవర్తనలు లేవని వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి చెబుతానన్నారు పృథ్వీ.