టీఎస్ పాలిసెట్-2020 షెడ్యూల్ విడుదల
టీఎస్ పాలిసెట్-2020 ప్రవేశాల షెడ్యూల్ ఎట్టకేలకు ఖరారు అయింది. ఈ నెల 12వ తేదీ నుంచి పాలిసెట్ మొదటి విడుత ప్రవేశాల ప్రక్రియ చేపట్టనున్నారు.
టీఎస్ పాలిసెట్-2020 ప్రవేశాల షెడ్యూల్ ఎట్టకేలకు ఖరారు అయింది. ఈ నెల 12వ తేదీ నుంచి పాలిసెట్ మొదటి విడుత ప్రవేశాల ప్రక్రియ చేపట్టనున్నారు. 12 నుంచి 17వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. 14 నుంచి 18వ తేదీ వరకు ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. 14 నుంచి 20వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అవకాశం కల్పించారు. ఈనెల 22న విద్యార్థులకు సీట్ల కేటాయింపు జరగనుంది.
ఇక, ఈ నెల 30 నుంచి పాలిసెట్ తుది విడుత ప్రవేశాల ప్రక్రియ జరగనుంది. సెప్టెంబర్ 30వ తేదీన, అక్టోబర్ 1న వెబ్ ఆప్షన్లు ఎంచుకోవల్సి ఉంటుంది. అక్టోబర్ 3న తుది విడుత ప్రవేశాలకు సంబంధించి సీట్ల కేటాయింపు చేస్తారు. అదే నెల 7వ తేదీ నుంచి పాలిటెక్నిక్ విద్యా సంవత్సరం మొదలు కానుంది. ఇక, అక్టోబర్ 15 నుంచి పాలిటెక్నిక్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ప్రైవేట్ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లకు సంబంధించి అక్టోబర్ 8న మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు ఆ విద్యా సంస్థ అధికారులు ప్రకటించారు.