బండి సంజయ్ అరెస్ట్.. గ్రాండ్ సక్సెస్ అని ప్రకటన
తెలంగాణ భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చిన 'ఛలో అసెంబ్లీ' కార్యక్రమం విజయవంతమైందని ఆపార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. 'ఛలో అసెంబ్లీ' కార్యక్రమానికి ఎన్ని అడ్డంకులు..
తెలంగాణ భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చిన ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమం విజయవంతమైందని ఆపార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమానికి ఎన్ని అడ్డంకులు.. నిర్బంధాలు విధించినా కార్యకర్తలు ఛేదించుకొని అసెంబ్లీ ముట్టడిలో పాల్గొన్నారని ఆయన తెలిపారు. అనేక మంది బీజేపీ నాయకులను గృహ నిర్బంధం చేశారని.. గ్రామీణ ప్రాంతం నుండి అసెంబ్లీకి రాకుండా ఎక్కడికక్కడ అరెస్టు చేశారని సంజయ్ ఆరోపించారు. ఇలాఉంటే, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి వెళ్తుండగా బండి సంజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో హైదరాబాద్ లో స్వల్ప ఉద్రిక్త వాతావరణ నెలకొంది. సంజయ్ ను తరలిస్తోన్న వాహనాన్ని ముందుకు వెళ్లనివ్వకుండా బీజేపీ కార్యకర్తలు అడ్డంగా పడుకున్నారు. చివరకు సంజయ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు గోషామహల్ స్టేషన్ కు తరలించారు.
అనేక మంది నాయకులను గృహ నిర్బంధం చేశారు. గ్రామీణ ప్రాంతం నుండి అసెంబ్లీకి రాకుండా ఎక్కడికక్కడ అరెస్టు చేశారు.అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో ఇప్పటివరకు అనేకమంది పాల్గొని అరెస్టు కావడం జరిగింది.ఇంకా చాలామంది అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పాల్గొంటారు. pic.twitter.com/hqnHcLTjb8
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) September 11, 2020
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఛలో అసెంబ్లీ కార్యక్రమం విజయవంతం.ఎన్ని నిర్బంధాలు విధించినా కార్యకర్తలు చేదించుకొని అసెంబ్లీ ముట్టడి లో పాల్గొన్నారు. pic.twitter.com/1Q1QoxvHM3
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) September 11, 2020
?ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి బయలుదేరిన @bandisanjay_bjp ను అడ్డుకున్న పోలీసులు
?ప్రతిఘటించిన బిజెపి కార్యకర్తలు, పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట
?అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యమాన్ని అణచివేసేందుకు @trspartyonline సర్కారు కుట్ర pic.twitter.com/sq0QRCJIvM
— BJP Telangana (@BJP4Telangana) September 11, 2020