Treasure found at Srisailam: శ్రీశైలంలో గుప్త నిధులపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ.. ఇప్పటివరకు దొరికిన నిధి వివరాలు ఇవే
ఆంధ్రప్రదేశ్లో ఆలయాలపై దాడుల వ్యవహారం రాజకీయ పక్షాల మధ్య కాక రేపుతుంటే.. మరోవైపు శ్రీశైలంలో గుప్త నిధులపై బలంగా చర్చ జరుగుతుంది.
Treasure found at Srisailam: ఆంధ్రప్రదేశ్లో ఆలయాలపై దాడుల వ్యవహారం రాజకీయ పక్షాల మధ్య కాక రేపుతుంటే.. మరోవైపు శ్రీశైలంలో గుప్త నిధులపై బలంగా చర్చ జరుగుతుంది. ఇంతవరకు గుప్తనిధుల కోసం ఆలయాలు తవ్వడం, విగ్రహాల ధ్వంసం చేయడం విన్నాం కానీ నిధులు దొరికిన దాఖలాలు మాత్రం లేవు. కానీ శ్రీశైలంలో గుప్త నిధులు దొరికినట్లు అధికారులే ప్రభుత్వానికి లేఖ రాశారు. టీవీ9 ఆ లేఖలను సంపాదించింది.
మే 10, 2017 లో పంచమఠాల జీర్ణోద్ధారణ పనులు చేస్తుండగా గంటా మఠం దగ్గర 700 గ్రాముల బంగారం, రెండున్నర కిలోల వెండి లభ్యమైంది. ఆ తర్వాత జీర్ణోద్ధరణ పనులు నిలిచిపోయాయి. అదే గంటా మఠం దగ్గర 07 .09.2020 మళ్లీ పనులు జీర్ణోద్ధారణ మొదలయ్యాయి. ఈ తవ్వకాల్లో 7, 8, 15 తేదీలతో పాటు 4 .10 .2020 న జరిగిన తవ్వకాలలో 15 బంగారు నాణేలు, 263 వెండి నాణేలు, ఒక రాగి నాణ్యం సహా 32 తామ్ర శాసనాలు దొరికాయి. సాంకేతిక కారణాల వల్ల ఆ తర్వాత జీర్ణద్దరణ పనులు ఆగిపోయాయి. అతి త్వరలోనే పనులు మళ్లీ మొదలుపెడతామని ఆలయ అధికారులు చెబుతున్నారు.
Also Read :
Today Gold and Silver Price: గుడ్ న్యూస్.. భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు..తాజా రేట్లు ఇలా ఉన్నాయి