ఏపీలో విద్యుత్ బిల్లుల చెల్లింపుపై.. ట్రాన్స్‌కో కీలక నిర్ణయం..!

ఓ వైపు కోవిద్-19 విలయతాండవం చేస్తోంటే.. మరోవైపు ఏపీ ప్రజలకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. విద్యుత్ బిల్లుల చెల్లింపునకు 45 రోజుల గడువు ఇస్తున్నట్లు ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు. నిబంధన ప్రకారం బిల్లు జారీ

ఏపీలో విద్యుత్ బిల్లుల చెల్లింపుపై.. ట్రాన్స్‌కో కీలక నిర్ణయం..!
Follow us

| Edited By:

Updated on: May 13, 2020 | 5:57 PM

ఓ వైపు కోవిద్-19 విలయతాండవం చేస్తోంటే.. మరోవైపు ఏపీ ప్రజలకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. విద్యుత్ బిల్లుల చెల్లింపునకు 45 రోజుల గడువు ఇస్తున్నట్లు ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు. నిబంధన ప్రకారం బిల్లు జారీ చేసినప్పటి నుంచి 15 రోజుల్లోపు చెల్లించాలని, కోవిద్-19 నేపథ్యంలో జూన్ 15 వరకు ఎలాంటి జరిమానా లేకుండా చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బిల్లులపై ఏవైనా అనుమానాలు ఉంటే 1912 నంబర్ కు ఫోన్ చేయాలన్నారు. కాగా ఈ నెల విద్యుత్ బిల్లులు భారీగా వచ్చాయని ప్రజల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.