అమెజాన్లో రైలు టికెట్లు.. అదిరిపోయే ఆఫర్లు..!
రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్. త్వరలోనే అమెజాన్ పే-యాప్ ద్వారా ట్రైన్ టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం లభించనుంది. ఈ మేరకు ఇటీవల ఐఆర్సీటీసీ, అమెజాన్ల మధ్య..
Train Ticket Booking: రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్. త్వరలోనే అమెజాన్ పే-యాప్ ద్వారా ట్రైన్ టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం లభించనుంది. ఈ మేరకు ఇటీవల ఐఆర్సీటీసీ, అమెజాన్ల మధ్య ఒప్పందం కూడా కుదిరింది. ఇప్పటిదాకా అమెజాన్ పే-యాప్తో విమానం, బస్సు టికెట్ల బుకింగ్ జరగుతుండగా.. ఇక నుంచి రైలు టికెట్ల అమ్మకాలు జరగనున్నాయి.
ఇదిలా ఉంటే అమెజాన్ ద్వారా మొదటిసారి రైలు టికెట్లు బుక్ చేసుకున్నవారికి 10 శాతం రాయితీ లభించనుండగా.. ప్రైమ్ సభ్యులకు 12 శాతం వరకు డిస్కౌంట్ ఉంటుంది. అలాగే రైల్వే అధికారులు సరుకు రవాణా నిమిత్తం ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్తో ఒప్పందం కుదుర్చుకోనున్నారని తెలుస్తోంది. కాగా, అక్టోబర్ 17న అమెజాన్ ‘గ్రేట్ ఇండియా ఫెస్టివల్’ ఆఫర్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
Also Read:
ఇంజినీరింగ్ విద్యార్ధులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..
నిరుపేద కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..