మీకు ఎస్‌బీఐ అక్కౌంట్ ఉందా? ఇకపై మినిమమ్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా?

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు వచ్చే నెల 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇకపై తమ బ్యాంకు ఖాతాల్లో ఉండాల్సిన కనీస నిల్వలపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బ్యాంకు ఖాతాల్లో ఉంచాల్సిన మినిమమ్ ఎమౌంట్ మొత్తాన్ని తగ్గించింది. ఎస్‌బీఐ తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం పట్టణ ప్రాంతాల్లో ని ఖాతాల్లో కనీసం రూ.3 వేలు ఉంచుకోవాలి. గతంలో ఇది రూ.5 వేలుగా ఉండేది. అదే […]

మీకు ఎస్‌బీఐ అక్కౌంట్ ఉందా? ఇకపై మినిమమ్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా?
Follow us

| Edited By:

Updated on: Sep 13, 2019 | 6:48 PM

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు వచ్చే నెల 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇకపై తమ బ్యాంకు ఖాతాల్లో ఉండాల్సిన కనీస నిల్వలపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బ్యాంకు ఖాతాల్లో ఉంచాల్సిన మినిమమ్ ఎమౌంట్ మొత్తాన్ని తగ్గించింది. ఎస్‌బీఐ తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం పట్టణ ప్రాంతాల్లో ని ఖాతాల్లో కనీసం రూ.3 వేలు ఉంచుకోవాలి. గతంలో ఇది రూ.5 వేలుగా ఉండేది. అదే విధంగా సెమీ అర్బన్ ప్రాంతాల్లో కనీసం రూ.2 వేలు ఉంచాలి. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని ఖాతాదారులు కనీసం ఒక వెయ్యి రూపాయలు ఉంచుకోవాలని బ్యాంకు ప్రకటించింది.

నిబంధంనలు పాటించని ఖాతాదారులపై ఛార్జీల మోత మోగనుంది. పట్టణ ప్రాంతాల్లో మినిమమ్ బ్యాలెన్స్  రూ.1500 వరకు మాత్రమే ఉంటే అటువంటి ఖాతాలపై రూ.10, రూ.750 వరకు ఉంటే రూ.12.75, అంతకు తగ్గిపోతే రూ.15 రూపాయలు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. వీటికి జీఎస్టీ అధనంగా చెల్లించాలి.

అయితే సేవింగ్స్ ఖాతాల్లో సొమ్ము డిపాజిట్ చేయాలనుకుంటే ఇకపై నెలకు మూడుసార్లు మాత్రమే డిపాజిట్ చేసేలా రూల్స్ మార్చారు. అది దాటితే అదనపు ఛార్జీలు వసూలు చేస్తారు. మూడుసార్లు లిమిట్ దాటిన తర్వాత నాలుగోసారి డిపాజిట్ చేసినా.. కనీసం రూ.100 రూపాయలు డిపాజిట్ చేసినా రూ.50 ఛార్జీలు వసూలు చేయనున్నారు. దీంతో పాటు జీఎస్టీ కూడా అదనంగా కట్టాల్సిందేనంటూ బ్యాంక్ ప్రకటించింది. అదే విధంగా హోం బ్రాంచి నుంచి కాకుండా వేరే బ్రాంచి నుంచి డిపాజిట్ చేయదల్చుకుంటే గరిష్టంగా రూ.2 లక్షల వరకు మాత్రమే అనుమతి ఇస్తారు. అదే విధంగా తమ ఎక్కౌంట్‌లో కనీసం రూ.25 వేలు బ్యాంకు బ్యాలెన్స్ ఉంచే వ్యక్తులు రెండు సార్లు ఉచితంగా నగదు ఉపసంహరణ చేసుకునే వీలు కల్పించారు. అదే విధంగా రూ.25 వేల నుంచి 50 వేల మధ్య బ్యాలెన్స్ ఉంచే ఖాతాదారులు నెలకు 10 సార్లు విత్ డ్రా చేసుకోవచ్చు. మినిమమ్ నెలకు రూ.1 లక్ష బ్యాలెన్స్ ఉంచే కస్టమర్లు ఎన్నిసార్లయినా విత్‌డ్రా చేసుకోవచ్చంటూ బ్యాంకు అధికారులు ప్రకటించారు.

అయితే హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ఏటీఎంల నుంచి నెలకు 10 సార్లు నగదును ఉపసంహరించుకోవచ్చు. నాన్ మెట్రో నగరాల్లో 12 సార్లు విత్ డ్రా చేసుకోవచ్చు. ఎప్పుడైనా చెక్ బౌన్స్ అయితే జీఎస్టీతో కలిపి రూ.168 ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. వీటన్నితో పాటు ఇతర బ్యాంకు కస్టమర్లు ఎస్‌బీఐ ఏటీఎంలలో నెలకు ఐదుసార్లు ఉచితంగా నగదు ఉపసంహరించుకోవచ్చు.

అయితే ఎస్‌బీఐ ఖాతాదారుల మినిమమ్ బ్యాలెన్స్‌కు సంబంధించి విడుదల చేసిన కొత్త రూల్స్‌పై  మధ్యతరగతి కస్టమర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చి ఖాతాదారుల వద్దనుండి బ్యాంకులు ముక్కుపిండి వసూలు చేస్తున్నాయంటూ పెదవి విరుస్తున్నారు.

30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు