తిరుమల కొండకు కార్తీకమాసం శోభ.. పోటెత్తిన భక్తజనం.. రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం.. ఎంత వచ్చిందంటే.?
ఇటీవల కాలంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. కార్తీకమాసం శోభ మొదలు కావడంతో..
Tirumala Hundi Income: ఇటీవల కాలంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. కరోనా పరిస్థితులు కుదుటపడటం, కార్తీకమాసం శోభ మొదలు కావడంతో తిరుమల ఆలయానికి భక్తజనం పోటెత్తుతున్నారు. దీనితో శ్రీవారి హుండీ ఆదాయం కూడా పెరుగుతోంది. గురువారం మరోసారి రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీకి ఆదాయం వచ్చింది.
గురువారం శ్రీవారిని 30,697 మంది భక్తులు దర్శించుకోగా.. హుండీలో రూ.2.16కోట్లు సమర్పించుకున్నారు. అలాగే 9,995 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ఇదిలా ఉంటే భక్తులకు పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కల్పించాలని టీటీడీ నిర్ణయం తీసుకోగా.. దానికి ఆగమ పండితులు, మఠాధిపతులు, పీఠాధిపతుల ఆమోదముద్ర వేశారు. దీనితో తిరుమలలో డిసెంబర్ 25 నుంచి పది రోజుల పాటు భక్తుల దర్శనార్థం ఉత్తర ద్వారాన్ని తెరవనున్నారు.
Also Read: రైల్వే ప్రయాణీకులకు ముఖ్య గమనిక.. పలు స్పెషల్ ట్రైన్స్ సమయాల్లో మార్పు.. కీలక సమాచారం ఇదే..