పులి గాండ్రింపులతో వణికిపోతున్న పల్లెలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో 20 ఏళ్లలో తొలిసారి

భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల సరిహద్దులో.. పెద్దపులి సంచారం ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.

పులి గాండ్రింపులతో వణికిపోతున్న పల్లెలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో 20 ఏళ్లలో తొలిసారి
Follow us

|

Updated on: Nov 22, 2020 | 9:15 AM

భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల సరిహద్దులో.. పెద్దపులి సంచారం ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఇల్లందు, గూడూరు మండలాల్లో పులి గాండ్రింపులతో జనం ఉలిక్కిపడుతున్నారు. ఆళ్లపల్లి మండలంలోని పాతూరు, సంధిబందం గ్రామంలో… పులి సంచారాన్ని గ్రామస్తులు, అధికారులు గుర్తించారు. అటవీప్రాంతంలోని పంటపొలాల్లో కొమరం సత్యనారాయణ అనే రైతుకు చెందిన ఎద్దును పులి చంపితింది.

తర్వాత అది చింతగండి వాగు మీదుగా నడిచివెళ్లినట్టుగా పంజా గుర్తులను గుర్తించారు అధికారులు. అవి పులివేనని నిర్ధారించారు. పులి జాడ కోసం సమీప ప్రాంతం మొత్తాన్ని అటవీశాఖ అధికారులు జల్లెడ పడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో 20 ఏళ్లలో పులి సంచరించడం ఇదేనని అధికారులు చెబుతున్నారు. పశువులను, బయట కట్టేయొద్దని చెబుతున్నారు. నైట్‌టైంలో ప్రజలు కూడా ఎవరూ బయట తిరగొద్దని హెచ్చరిస్తున్నారు.

అనంతారం, దామరతోగు అటవీప్రాంతంలో పులి సంచారం ఉన్నట్టు అనుమానిస్తున్నారు అధికారులు. దీంతో మణుగూరు, ఇల్లెందు, ములుగు, తాడ్వాయి డివిజన్ల అటవీశాఖ సిబ్బందిని అప్రమత్తం చేశారు. నీటి తోగులు, కుంటలతో పాటు అటవీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పరిశీలిస్తున్నారు. కొందరు పులి గాండ్రింపులను విన్నట్టుగా అధికారులకు చెబుతున్నప్పటికీ… దాని జాడ మాత్రం దొరకడం లేదు.

Also Raed :

జీహెచ్‌ఎంసీ పోలింగ్‌..డిసెంబర్ 1న సెలవు దినంగా ప్రకటించిన ప్రభుత్వం

చనిపోయినా మరికొందరి జీవితాల్లో వెలుగులు, కానిస్టేబుల్​ అంత్యక్రియల్లో పాల్గొన్న సీపీ సజ్జనార్