Tiger attack : గ్రామంలోకి చొరబడిన పెద్దపులి.. దారుణంగా వ్యక్తిని చంపి.. ఆపై అడవిలోకి ఎత్తుకెళ్లి…

ఆభరణ్యాలనుంచి జనావాసంలోకి వస్తున్నాయి వన్యమృగాలు.. ఇటీవల చాలా చోట్ల పులులు ప్రజలపై దాడి చేస్తున్న సంఘటనలు నిత్యం చూస్తున్నాం. తాజాగా రాజస్థాన్‌లోని ఓ గ్రామంలోకి చొరబడిన పెద్దపులి..

Tiger attack : గ్రామంలోకి చొరబడిన పెద్దపులి.. దారుణంగా వ్యక్తిని చంపి.. ఆపై అడవిలోకి ఎత్తుకెళ్లి...
Follow us

|

Updated on: Jan 08, 2021 | 9:07 AM

Tiger attack : ఆభరణ్యాలనుంచి జనావాసంలోకి వస్తున్నాయి వన్యమృగాలు.. ఇటీవల చాలా చోట్ల పులులు ప్రజలపై దాడి చేస్తున్న సంఘటనలు నిత్యం చూస్తున్నాం. తాజాగా రాజస్థాన్‌లోని ఓ గ్రామంలోకి చొరబడిన పెద్దపులి ఓ వ్యక్తిపై దాడిచేసి చంపేసింది. రాజస్థాన్ రాష్ట్రంలోని సవాయి మాధోపూర్ జిల్లాలోని రణతంబోర్ టైగర్ రిజర్వు ఫారెస్టులో ఓ పులి 40 ఏళ్ల వయసుగల వ్యక్తిపై దాడి చేసి చంపింది. అయితే ఆయన మృతదేహం కనిపించడం లేదని, తమ సిబ్బంది వెతుకుతున్నారని టైగర్‌ రిజర్వ్‌ ఫీల్డ్‌ డైరెక్టర్‌ టికమ్‌ చంద్‌ వర్మా వెల్లడించారు. పులి చంపి అడవిలోకి తీసుకువెళ్లింతుందని అధికారులు చెప్తున్నారు. కాగా పులి సంచరిస్తుండటంతో టైగర్‌ రిజర్వ్‌ సమీపంలోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మృతుని కుటుంబానికి రూ.4 లక్షలు పరిహారం అందిస్తామన్నారు అధికారులు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Elephant attack in chittoor : చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం.. వ్యక్తికి గాయాలు..

Tollywood Young Heroes: వేసవినే నమ్మకున్న టాలీవుడ్ యంగ్ హీరోలు.. చిత్రాల విడుదలకు సన్నాహాలు..!