Professor Jayashankar : అప్పుడు సమాధి.. ఇప్పుడు స్మృతివనం. కాంట్రవర్సీకి కేరాఫ్గా ప్రొఫెసర్ జయశంకర్ జ్ఞాపకాలు
Professor Jayashankar అప్పుడు సమాధి.. ఇప్పుడు స్మృతివనం. కాంట్రవర్సికి కేరాఫ్గా మారాయి ప్రొఫెసర్ జయశంకర్ జ్ఞాపకాలు. టెంపుల్ భూమిలో సమాధి నిర్మిస్తున్నారంటూ..
Professor Jayashankar అప్పుడు సమాధి.. ఇప్పుడు స్మృతివనం. కాంట్రవర్సీకి కేరాఫ్గా మారాయి ప్రొఫెసర్ జయశంకర్ జ్ఞాపకాలు. టెంపుల్ భూమిలో సమాధి నిర్మిస్తున్నారంటూ.. అప్పుడు అర్చకులు అభ్యంతరం వ్యక్తం చేయగా.. జయశంకర్ స్మృతివనంలో ఆ లీడర్ల ఫొటోలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. హన్మకొండలో ఆచార్య జయశంకర్ స్మృతి వనంలో విగ్రహాల వివాదం మళ్లీ రాజుకుంటుంది. జయశంకర్ జ్ఞాపకాలను నెమర వేసుకుంటూ నిర్మిస్తున్న శిల్పాల స్క్రీన్పై కేసీఆర్, కేటీఆర్ శిల్పాలను చెక్కడమే ఈ వివాదానికి కారణం. తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన వారి పక్కన కేసీఆర్ ఫొటోలు పెడతారా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
బాలసముద్రం ఏకశిలా పార్కును జయశంకర్ స్మృతి వనంగా మార్చుతోంది తెలంంగాణ ప్రభుత్వం. ప్రత్యేక నిధులు కేటాయించి హట్టహాసంగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే పార్క్ నిర్మాణం పూర్తైంది. చెట్లు, పూలమొక్కలు, జిమ్ పరికరాలు ఏర్పాటు చేశారు. జయశంకర్ కాంస్య విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఆచార్యుడి జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ చిత్రపటాలతో నిర్మించిన ఈ శిల్పాల నిర్మాణం వివాదాస్పదంగా మారింది. జయశంకర్ సార్ శిల్పాలతో పాటు కేసీఆర్, కేటీఆర్ శిల్పాల ఏర్పాటు ఓ వర్గానికి ఆగ్రహం తెప్పించింది.
అమరవీరుల శిల్పాలు పెట్టకుండా కేసీఆర్, కేటీఆర్లో ఫొటోలు ఏంటని ప్రశ్నిస్తున్నారు. శిల్పాలు పెట్టడమెంటని ప్రశ్నిస్తున్నారు. జయశంకర్కు తెలంగాణ ప్రభుత్వం గౌరవం ఇస్తున్నా.. ఈ ఫొటోలు ఇక్కడ అవసరమా అని అంటున్నారు. ఇది బీజేపీ కార్యకర్తలు చేసే రాద్ధాంతం అని ఆరోపిస్తున్నారు గులాబీ పార్టీ కార్యకర్తలు. కేసీఆర్.. లేకపోతే.. తెలంగాణ ఉద్యమం ఎక్కడ ఉందంటూ.. తమ వాయిస్ వినిపిస్తున్నారు. ప్రజా సమస్యలపై దృష్టి సారించని కమలనాథులు.. అనవసరంగా వివాదం చేస్తున్నారని మండిపడుతున్నారు. కాగా, ఈ పార్క్ నిర్మాణం కోసం ప్రభుత్వం 3 కోట్ల పైచిలుకు నిధులను కేటాయించింది. మొదటిదశలో కోటి 70 లక్షల రూపాయలు మంజూరు చేసింది. గ్రేటర్ కార్పొరేషన్తో పాటు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పనుల పురోగతిని పర్యవేక్షిస్తోంది.