తిరుమల శ్రీవారికి నిత్య కల్యాణోత్సవం.. ఆ విశిష్ఠత ఎలా వచ్చిందంటే?
అఖిలాండకోటి బ్రహ్మోడనాయకుని వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి అర్చకులు వైభవంగా నిర్వహించారు. స్వామివారి సేనాధిపతులైన వారు ఆలయం నుంచి ప్రదక్షణగా తిరువీధుల్లో ఊరేగుతూ తిరిగి ఆలయానికి చేరుకున్నారు. ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించడానికే సేనాధిపతి ఉత్సవాన్ని నిర్వహించారు. ఆలయంలోని యాగశాలలో అంకురార్పణకు, వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుమల శ్రీవారికి నిత్య కల్యాణోత్సవం.. ఆ విశిష్ఠత ఎందుకొచ్చిందో తెలుసా? పూర్వం శ్రీ మలయప్పస్వామివారికి విశేష పర్వదినాల్లో, బ్రహ్మోత్సవాల్లో మాత్రమే కల్యాణోత్సవం జరిగేది. కానీ ఆ తర్వాత […]
అఖిలాండకోటి బ్రహ్మోడనాయకుని వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి అర్చకులు వైభవంగా నిర్వహించారు. స్వామివారి సేనాధిపతులైన వారు ఆలయం నుంచి ప్రదక్షణగా తిరువీధుల్లో ఊరేగుతూ తిరిగి ఆలయానికి చేరుకున్నారు. ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించడానికే సేనాధిపతి ఉత్సవాన్ని నిర్వహించారు. ఆలయంలోని యాగశాలలో అంకురార్పణకు, వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
తిరుమల శ్రీవారికి నిత్య కల్యాణోత్సవం.. ఆ విశిష్ఠత ఎందుకొచ్చిందో తెలుసా?
పూర్వం శ్రీ మలయప్పస్వామివారికి విశేష పర్వదినాల్లో, బ్రహ్మోత్సవాల్లో మాత్రమే కల్యాణోత్సవం జరిగేది. కానీ ఆ తర్వాత తాళ్ళపాక అన్నమాచార్యుల వారు తిరుమలలో నిత్యకల్యాణాన్ని ఏర్పాటు చేసి స్వయంగా తాను కన్యదాతగా కూడా నిర్వహించారని పురాణాలు చెబుతున్నాయి. అప్పుడు 15వ శతాబ్దంలో తాళ్లపాక అన్నమయ్య ఏర్పాటు చేసిన ఈ నిత్యకల్యాణోత్సవం నేటికీ నిరాటంకంగా కొనసాగుతున్నాయి. తిరుమల క్షేత్రంలో భక్తులు అత్యధికంగా పాల్గొనే సేవ కూడా నిత్యకల్యాణోత్సవం ఒక్కటే.
నిత్య కల్యాణోత్సవాలు తిరుమలలోని ఏ ప్రాంతంలో జరుగుతాయో తెలుసా?
తూర్పు ముఖంగా ఉన్న కళ్యాణవేదికపై మలయప్పస్వామి, శ్రీదేవి-భూదేవిలకు నిత్యం ఉదయం 11. 30 నుండి ఒంటిగంట మధ్య కల్యాణోత్సవం జరుగుతుంది. దీన్నే ‘నిత్యకల్యాణోత్సవం’ అంటారు . ఈ కల్యాణోత్సవాలను గతంలో విమాన ప్రదక్షిణంలో గల కళ్యాణ మండపంలో జరిపేవారు. భక్తుల రద్దీ పెరగటంతో రంగనాయకుల మండపానికి.. ఆ తరువాత ప్రస్తుత ప్రదేశానికి మార్చారు.