Andhra Pradesh: పట్టపగలే కిడ్నాప్.. పోలీసులకు దొరకని క్లూ.. అనంతపురంలో తీవ్ర ఉత్కంఠ

ఒక వ్యక్తి పట్టపగలు అందరూ చూస్తుండగా కిడ్నాప్ కు గురయ్యాడు. ఈ ఘటన జరిగి దాదాపు 30గంటలు గడుస్తోంది. అయినా ఇప్పటికీ చిన్న క్లూ కూడా దొరకలేదు. ఆస్తి వివాదంలో ఈ కిడ్నాప్ జరిగిందని బాధితుడి కుటుంబ సభ్యులు చెబుతుండగా పోలీసులు మాత్రం...

Andhra Pradesh: పట్టపగలే కిడ్నాప్.. పోలీసులకు దొరకని క్లూ.. అనంతపురంలో తీవ్ర ఉత్కంఠ
Kidnap In Rayadurgam
Follow us

|

Updated on: Aug 08, 2022 | 6:36 PM

ఒక వ్యక్తి పట్టపగలు అందరూ చూస్తుండగా కిడ్నాప్ కు గురయ్యాడు. ఈ ఘటన జరిగి దాదాపు 30గంటలు గడుస్తోంది. అయినా ఇప్పటికీ చిన్న క్లూ కూడా దొరకలేదు. ఆస్తి వివాదంలో ఈ కిడ్నాప్ జరిగిందని బాధితుడి కుటుంబ సభ్యులు చెబుతుండగా పోలీసులు మాత్రం ట్రేస్ చేయలేకపోతున్నారు. అనంతపురం (Anantapur) జిల్లా రాయదుర్గంలో జరిగిన కిడ్నాప్ గురైన వ్యక్తి ఎక్కడ..? ఎవరు కిడ్నాప్ చేశారు..? అనే ప్రశ్నలు అంతుచిక్కనివిగా మారాయి. అనంతపురం జిల్లాలో ఒక భూస్వామి కిడ్నాప్ కు గురైన సంఘటన కలకలం రేపుతోంది. బళ్లారి (Ballari) రోడ్డు కుంటి మారెమ్మ దేవాలయం వద్ద పట్టణానికి చెందిన సిద్ధేశ్వర అనే 52 ఏళ్ల వ్యక్తి కిడ్నాప్ గురయ్యాడు. సిద్ధేశ్వర ద్విచక్ర వాహనంలో వ్యవసాయ పొలంలో కూలి పని చేస్తున్న వారికి మధ్యాహ్న భోజనం తీసుకెళ్తుండగా పట్టణ శివారు ప్రాంతమైన బళ్లారి రోడ్ కుంటి మారెమ్మ దేవాలయం వద్ద పట్టపగలు ప్రజలు చూస్తుండగా కిడ్నాప్ చేశారు. తెల్ల స్కార్పియోలో వచ్చిన దుండగలు సిద్దాను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై బాధితుని తండ్రి కూన తిప్పేస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బళ్లారిలో ఉన్న చెల్లలు భర్త సుమారు 2కోట్ల వరకు అప్పులు చేశాడు. దీనిపై సిద్ధేశ్వర పలుసార్లు పంచాయతీ చేశాడు. చేసిన అప్పు చెల్లించకపోవడంతో చెల్లలు భర్తకు బదులుగా సిద్దాను కిడ్నాప్ చేయించినట్లు బాధితుని తండ్రి, కూనా తిప్పేస్వామి ఫిర్యాదు చేశారు. అయితే కిడ్నాప్ జరిగి ఇప్పటికే 30 గంటలు కావస్తోంది. అందునా పట్టపగలు జరిగింది. అందరూ చూస్తుండగా జరిగింది. అయినప్పటికీ పోలీసులు మాత్రం చిన్నక్లూ కూడా సంపాదించలేకపోయారు. దుండగులు స్కార్పియో వాహనంలో వచ్చినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

నిత్యం వాహనాల రాకపోకలు ఉన్న ప్రాంతంలో ఈ ఘటన జరగడం కలకలం రేపింది. పోలీసులు మాత్రం కిడ్నాపర్లను పట్టుకునేందుకు ఇప్పటికే మూడు బృందాలను ఏర్పాటు చేసినట్టు చెబుతున్నారు. ఇందులో ఒక టీం కర్ణాటక ప్రాంతానికి కూడా వెళ్లినట్టు తెలుస్తోంది. గంటగంటకూ బాధితుని కుటుంబ సభ్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కిడ్నాప్ కు గురైన వ్యక్తి నుంచి ఎలా ఫోన్ కాల్ రాకపోవడంతో వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడిని క్షేమంగా తీసుకురావాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!