Thanks to Facebook: ఫేస్బుక్లో నాదే ఫస్ట్ ప్లేస్.. తర్వాత మోదీ.. థ్యాంక్స్ జుకర్బెర్గ్ !
ఫేస్బుక్లో జుకర్బెర్గ్ తనను నెం.1 గా, భారత ప్రధాని మోదీని నెం.2 గా పేర్కొనడంపట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది జుకర్ తనకు ఇఛ్చిన గౌరవమని అన్నారు. ‘ఎస్.. నిజానికి నేను రెండువారాల్లో ఇండియాకు వెళ్తున్నాను.. నా ఈ పర్యటన కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాను’ అని ఆయన ట్వీట్ చేశారు. జుకర్బెర్గ్ని అభినందించారు. ప్రపంచంలోని రెండు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య సాన్నిహిత్యాన్ని పెంపొందించేందుకు ట్రంప్, మోదీ ఇద్దరూ […]
ఫేస్బుక్లో జుకర్బెర్గ్ తనను నెం.1 గా, భారత ప్రధాని మోదీని నెం.2 గా పేర్కొనడంపట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది జుకర్ తనకు ఇఛ్చిన గౌరవమని అన్నారు. ‘ఎస్.. నిజానికి నేను రెండువారాల్లో ఇండియాకు వెళ్తున్నాను.. నా ఈ పర్యటన కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాను’ అని ఆయన ట్వీట్ చేశారు. జుకర్బెర్గ్ని అభినందించారు. ప్రపంచంలోని రెండు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య సాన్నిహిత్యాన్ని పెంపొందించేందుకు ట్రంప్, మోదీ ఇద్దరూ కృషి చేస్తున్న వేళ.. అమెరికా అధినేత పర్యటన పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. తన భార్య మెలనియాతో కలిసి ట్రంప్ ఈ నెల 24-25 తేదీల్లో భారత పర్యటనకు రానున్నారు. ఢిల్లీ, అహ్మదాబాద్ నగరాలను సందర్శించనున్నారు. అహ్మదాబాద్ లో ట్రంప్ కు లక్షలాది ప్రజలు స్వాగతం చెప్పవచ్చు. అతి పెద్దదైన మొతేరా క్రికెట్ స్టేడియంలో మోడీ, ట్రంప్ ఉమ్మడిగా ప్రసంగించనున్నారు. అయితే వీరి భేటీ సందర్భంగా భారత-అమెరికా దేశాల మధ్య వాణిజ్య వివాదాలు పరిష్క్రమవుతాయా అన్నది సందేహంగా ఉందని వాణిజ్య వర్గాలు పేర్కొంటున్నాయి. ట్రంప్ రాక సందర్భంగా అమెరికాతో ఇండియా పరిమితమైన ఒప్పందం కుదుర్చుకోవచ్చునని, ఆ దేశంలో తన పౌల్ట్రీ, డెయిరీ మార్కెట్లను పాక్షికంగా ఓపెన్ చేయవచ్చ్చునని భావిస్తున్నారు.
Great honor, I think? Mark Zuckerberg recently stated that “Donald J. Trump is Number 1 on Facebook. Number 2 is Prime Minister Modi of India.” Actually, I am going to India in two weeks. Looking forward to it!
— Donald J. Trump (@realDonaldTrump) February 14, 2020
ప్రపంచంలో పెద్దఎత్తున పాలను ఉత్పత్తి చేసే దేశాలలో ఒకటైన ఇండియా.. 80 మిలియన్ల మంది గ్రామీణ పాల వ్యాపారుల మనుగడను దెబ్బ తీయకుండా చూసేందుకు పాలు, పాల ఉత్పత్తుల దిగుమతులను ప్రభుత్వం తగ్గించింది. తమ దేశ సరకులపై భారత్ సుంకాలు తగ్గించిన పక్షంలో.. తాము కూడా వాణిజ్య సంబంధ ప్రాధాన్యాతలను పునరుధ్ధరించేందుకు ట్రంప్ అంగీకరించవచ్చు. చైనా తరువాత ఇండియాకు అతి పెద్ద ట్రేడ్ పార్ట్ నర్ అమెరికాయే. 2018 లో అమెరికాతో భారత ద్వైపాక్షిక సరకులు, సర్వీసుల వాణిజ్య కార్యకలాపాలు 142.6 బిలియన్ డాలర్ల మేర పెరిగాయి. అయితే.. 2019 లో ఇండియాకు సంబంధించి అమెరికా 23.2 బిలియన్ డాలర్ల దిగుమతులను నష్టపోయింది.