ఇకపై ఏపీలో రోజుకు పదివేలకు పైగా కరోనా పరీక్షలు
ఇకపై ఏపీలో ప్రతీ రోజు పది వేల నుంచి పదిహేను వేల వరకు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. కొత్తగా ర్యాపిడ్ టెస్టు కిట్లు దక్షిణ కొరియా నుంచి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.
ఇకపై ఏపీలో ప్రతీ రోజు పది వేల నుంచి పదిహేను వేల వరకు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. కొత్తగా ర్యాపిడ్ టెస్టు కిట్లు దక్షిణ కొరియా నుంచి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. కోవిడ్ –19 నివారణా చర్యలపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ సమీక్ష జరిపారు. ర్యాపిడ్ టెస్టు కిట్లు రావడంతో పరీక్షలు పెరుగుతున్నాయని వైద్యులు ముఖ్యమంత్రికి వివరించారు. రోజుకు 10వేల నుంచి 15వేలకు కరోనా టెస్టులు చేసే సామర్థ్యం పెరుగుతుందని అధికారులు తెలిపారు.
కుటుంబ సర్వేలో గుర్తించిన వారందరికీ కూడా పరీక్షలు నిర్వహించాలని సీఎం పునరుద్ఘాటించారు. పేషెంట్ మేనేజ్మెంట్పై సీఎం ఆరా తీసినట్లు సమాచారం. పేషెంట్ కేర్ మేనేజ్మెంట్లో భాగంగా గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్నామని వైద్యశాఖ అధికారులు వివరించారు. క్రిటికల్ కేర్ మేనేజ్మెంట్ కోసం కొంతమంది డాక్టర్లతో కూడా ఒక కంట్రోల్ రూంను ఏర్పాటు చేశామని, ఏ సమయంలోనైనా ఇద్దరు డాక్టర్లు అందుబాటులో ఉంటారని, రోగి చికిత్స పొందుతున్న సంబంధిత ఆస్పత్రి వైద్యులకు నిరంతరం గైడెన్స్ ఇస్తారని, పేషెంట్ పారామీటర్స్పై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తారని వైద్య అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.