ఈ నెలాఖరులో యాసంగి ‘రైతుబంధు’ !
రైతులకు వివిధ దశల్లో పెట్టుబడి సాయం అందించేందుకు తెలంగాణ సర్కార్ 2018 వానాకాలం సీజన్ నుంచి సంచలనాత్మక ‘రైతుబంధు’ పథకం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
రైతులకు వివిధ దశల్లో పెట్టుబడి సాయం అందించేందుకు తెలంగాణ సర్కార్ 2018 వానాకాలం సీజన్ నుంచి సంచలనాత్మక ‘రైతుబంధు’ పథకం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ యాసంగి సీజన్లోనూ రైతులకు పెట్టుబడి సాయం అందనుంది. ఇందుకు సంబంధించిన నగదును ఈ నెలాఖరులో గానీ, డిసెంబరు మొదటి వారంలో గానీ రైతుల అకౌంట్లలో జమ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, గత వానాకాలం సీజన్కు సంబంధించి భారీ వర్షాల కురవడంతో పంటల కోతలు ఆలస్యంగా ప్రారంభమై ఇప్పుడిప్పుడే ముందుకు వెళ్తున్నాయి.
దీంతో యాసంగి సీజన్ స్టార్టయినా ఇంకా పంటల సాగు మొదలవ్వలేదు. కొన్ని చోట్ల వరికోతలు పూర్తయినా ఇంకా నార్లు పోయడంగానీ, నాట్లు వేయడం గానీ జరగలేదు. దీంతో.. ప్రభుత్వం ఈ యాసంగి రైతుబంధు సాయాన్ని ఎప్పుడు చెల్లిస్తుందనే చర్చ మొదలైంది. కాగా, గవర్నమెంట్ నుంచి వ్యవసాయశాఖకు ఇంకా ఎలాంటి సంకేతాలు రాలేదని వ్యవసాయ కమిషనరేట్లో రైతుబంధు విభాగాన్ని పర్యవేక్షించే సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. శనివారం 2020-21 బడ్జెట్పై ముఖ్యమంత్రి మధ్యంతర రివ్యూ జరపనున్నారు. ఇందులో రైతుబంధు నిధుల సర్దుబాటుపై చర్చించే ఛాన్స్ ఉంది.
Also Read : Flash : అజయ్ దేవగణ్ దర్శకత్వంలో అమితాబ్