యూకేలో స్ట్రెయిన్ వైరస్ వ్యాప్తితో అప్రమత్తమైన తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖ..విదేశాల నుంచి వచ్చేవారిపై స్పెషల్ ఫోకస్
యూకేలో కొత్త రకం కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్య శాఖ అప్రమత్తం అయింది. గత వారం రోజుల్లో విదేశాల నుంచి వచ్చిన వాళ్ల ఆరోగ్య పరిస్థితిని తెలుసు....
High Alert in Telangana : యూకేలో కొత్త రకం కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్య శాఖ అప్రమత్తం అయింది. గత వారం రోజుల్లో విదేశాల నుంచి వచ్చిన వాళ్ల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అధికారులు కరోనా సర్వేలెన్సును పరిశీలిస్తున్నారు.
ఎయిర్పోర్ట్లో ఇటీవల ఆర్టీపీసీఆర్ టెస్టులు ప్రారంభించారు. పాజిటివ్ వచ్చిన వాళ్లను ఆస్పత్రులకు పంపుతున్నారు. నెగిటివ్ వచ్చినా వారం రోజులు క్వారంటైన్ ఉండాలని సూచిస్తున్నారు.
అటువంటి అనుమానాలున్నా వెంటనే వైద్య అధికారులను కలవాలని ప్రయాణికులకు సూచిస్తున్నారు. పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు చేసిన తర్వాతే ఎయిర్ పోర్టును వీడేందుకు అనుమతి ఇస్తున్నారు. గత వారం రోజుల క్రితం వచ్చిన వారి వివరాలను కూడా అధికారులు సేకరిస్తున్నారు. వారి ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసు కోవాలని స్థానిక అధికారులను ఆదేశిస్తున్నారు.